Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీలో శ్రీవారి వైభవం: అద్వానీ సంతోషం, ఇక్కడే ఆశీస్సులు పొందండి: వెంకయ్య

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం శ్రీవారి వైభవోత్సవం ప్రారంభమైంది. ఢిల్లీ ప్రజలు శ్రీవారి ఆశీస్సులు పొందాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. స్వర్ణభారతి, టిటిడి, జిఎంఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.

ఇవి నవంబర్ 8వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీ, కేంద్రమంత్రి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్వానీ మాట్లాడారు. శ్రీవారిని ఢిల్లీలోనే దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

 Sreevari Vaibhavalu in New Delhi

తిరుపతి వెళ్లలేని భక్తు కోసం ఇక్కడే వైభవోత్సవం నిర్వహిస్తున్నారన్నారు. తన కుటుంబం అంతా ఈ వైభవోత్సవంలో పాల్గొంటుందని అద్వానీ చెప్పారు. దీనిని నిర్వహించిన వెంకయ్య నాయుడికి ధన్యవాదాలు అన్నారు.

వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... ఢిల్లీ ప్రజలు శ్రీవారి ఆశీస్సులు పొందాలన్నారు. ఈ వైభవోత్సవంలో పాల్గొనాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. టిటిడి, జిఎంఆర్, స్వర్ణభారతి ట్రస్ట్ కలిసి దీనిని నిర్వహిస్తోందని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+