అది మన సీటేనా అంటే మాట్లాడరే: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఏ పార్టీకా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అన్నిరకాలుగా ప్రణాళికలను రచించుకొని వాటిని అమలుపరుచుకుంటూ ముందుకు వెళుతున్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలపై అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం దృష్టి సారించాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గత ఎన్నికల సమయంలో వైసీపీ పైచేయి సాధించింది. మరోసారి అవే ఫలితాలను పునరావృతం చేయాలని వైసీపీ యోచిస్తుండగా, తమ పట్టును నిరూపించుకోవాలనే ధ్యేయంతో టీడీపీ ఉంది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన నియోజకవర్గం ఎచ్చెర్ల. ఇక్కడి నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసిన గొర్లె కిరణ్ కుమార్ విజయం సాధించారు. టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావుపై 18,711 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కళా వెంకట్రావు తన సమీప ప్రత్యర్థి, వైసీపీ తరఫున పోటీచేసిన పిన్నిటి సాయిపై 4741 ఓట్ల తేడాతో గెలుపును కైవసం చేసుకున్నారు.

1967లో నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన ఎన్ ఏ నాయుడు ఘనవిజయం సాధించారు. తర్వాత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి, ఆ తర్వాత ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించాయి. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత వరుసగా ఐదు ఎన్నికల్లో 1999 వరకు కె.ప్రతిభా భారతి గెలుపు బావుటాను ఎగరవేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా గెలుపొందిన కొండ్రు మురళీమోహన్ 2004లో ఇక్కడి నుంచి విజయం సాధించారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మారుస్తూ వస్తున్న క్రమంలో కళా వెంకట్రావుకు సీటు ఇస్తారా? లేదంటే వేరే కొత్త వ్యక్తిని పరిచయం చేస్తారా? అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న కిరణ్ కుమార్ కు మరోసారి సీటు వస్తుందా? లేదా? అనేదానిపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ రెండు పార్టీల తరఫున రాబోయే ఎన్నికల సమరం కూడా హోరాహోరీగా జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications