శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్: టీటీడీ తరహాలో స్థానికులకు బిగ్ ఆఫర్
Srisailam temple: ప్రఖ్యాత శైవక్షేత్రం శ్రీశైలంలో వెలసిన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు కల్పించే సౌకర్యాలు, స్పర్శ దర్శనం టికెట్లకు సంబంధించిన అంశాలపై ఆలయ పాలకమండలి దృష్టి సారించింది. దీనిపై రూపొందించిన పలు ప్రతిపాదనలను ఆమోదించింది. వీఐపీ బ్రేక్ దర్శనం, తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో స్థానికులకు స్పర్శదర్శన భాగ్యాన్ని కల్పించడం వంటివి ఇందులో ఉన్నాయి.
గతంలో భక్తుల సూచనల మేరకు స్పర్శ దర్శనం మధ్యాహ్నం స్లాట్ను కూడా ఆలయ అధికారులు పునరుద్ధరించిన విషయం తెలిసిందే. శని, ఆది, సోమవారాల్లో మధ్యాహ్నం కూడా భక్తులు మల్లికార్జునుడిని స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఈ మూడు రోజులు మధ్యాహ్నం మల్లన్న స్పర్శదర్శనం చేసుకునే వారికి ఆన్ లైన్లో 350 టికెట్లు, కరెంట్ బుకింగ్లో 200 టికెట్లు అందుబాటులో ఉంచారు.

ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్లను జారీ చేయడానికి ఏర్పాటు చేసిన కరెంట్ బుకింగ్ విధానానికి బదులుగా ఆన్లైన్ వ్యవస్థను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్జిత సేవ, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారు ఆన్లైన్లో తాము బుక్ చేసుకున్న టికెట్ల కాపీని దర్శన సమయంలో అధికారులకు చూపించాల్సి ఉంటుంది. వాటిని స్కాన్ చేసి, సదరు భక్తుడి వివరాలు సరిపోలిన తరువాతే ఆర్జిత సేవ, స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తారు. భక్తులు తమ వెంట తప్పనిసరిగా ఆధార్ కార్డును వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.
ఇక 150 రూపాయల శీఘ్ర దర్శనం, 300 రూపాయల అతి శీఘ్ర దర్శనం టికెట్లు మాత్రం ఆన్లైన్తో పాటు కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేస్తారు. కరెంట్ బుకింగ్ ద్వారా కూడా భక్తులు వాటిని పొందవచ్చు. శీఘ్ర దర్శనం, అతి శీఘ్రదర్శనం టికెట్లల్లో 30 శాతం ఆన్లైన్ బుకింగ్ కోసం కేటాయించారు. మిగిలిన 70 శాతం టికెట్లను కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేస్తారు.
తాజా నిర్ణయాలు..
ఇప్పుడు తాజాగా శ్రీశైలంలో ఛైర్మన్ రమేష్ నాయుడు అధ్యక్షతన దేవస్థానం పాలక మండలి సమావేశమైంది. పలు కీలక ప్రతిపాదనలను ఆమోదించింది.
- 50 కోట్ల రూపాయలతో దేవస్థానం ఉద్యోగుల కోసం సున్నపెంటలో నిర్మించిన స్టాఫ్ క్వాటర్స్ కు సిబ్బందిని తరలించే ప్రక్రియ వేగవంతం చేయడంపై ఇందులో సభ్యులు చర్చించారు.
- తిరుమల తిరుపతి తరహాలో నెలలో ఒక రోజు స్థానికులకు స్పర్శ దర్శన భాగ్యం కల్పించడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలను పాలక మండలి ఆమోదించింది.
- అలాగే- 500 రూపాయల వీఐపీ బ్రేక్ టికెట్ తీసుకున్న భక్తులకు ఒక లడ్డు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు.
- ఆలయ భద్రత, నకిలి టికెట్లు దళారుల దర్శనాల విషయంలో విజిలెన్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళెందుకు ప్రతిపాదనలు చేయాలని పాలకమండలి తీర్మానించింది.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications