అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజల గుండెల్లోనే పరిటాల రవి: బాధగా ఉందన్న సునీత

దివంగత నేత పరిటాల రవి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని మంత్రులు పరిటాల సునీత అన్నారు. పరిటాల రవి మరణించి ఎంత కాలమైనా ప్రజల గుండెల్లో ఆయన చేసిన పోరాటాలు నిలిచే ఉంటాయని అన్నారు.

|
Google Oneindia TeluguNews

అనంతపురం: దివంగత నేత పరిటాల రవి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని మంత్రి పరిటాల సునీత అన్నారు. పరిటాల రవి మరణించి ఎంత కాలమైనా ప్రజల గుండెల్లో ఆయన చేసిన పోరాటాలు నిలిచే ఉంటాయని అన్నారు.

అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురంలో రవి జయంతిని నిర్వహించారు. రవి ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి దేవినేని తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు నివాళులర్పించి రవితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Sunitha Paid tribute paritala ravi

ఈ సందర్భంగా మంత్రి సునీత మాట్లాడుతూ.. రవి 60వ ఏట షష్ఠిపూర్తి చేసుకోవాల్సిన సందర్భంలో నివాళులర్పించడం బాధగా ఉందని సునీత న్నారు. రవి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు.

ప్రజల కోసం పోరాటాలు చేసిన నాయకుడిని కాంగ్రెస్‌ పార్టీ హయాంలో హత్య చేశారని.. ఆ సంస్కృతిని ఇప్పటికైనా విడనాడాలని మంత్రి దేవినేని అన్నారు. కాగా, రవి జయంత్రి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

English summary
Andhra Pradesh minister Paritala Sunitha Paid tributes paritala ravi on his 60th birthday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X