వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అనుమానాస్పద స్థితిలో నర్సు మృతి: ప్రేమ వ్యవహారమే
విజయవాడ కేదారేశ్వరిపేటలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ విధులకు వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో తాడేపల్లి మహానాడుకు చెందిన రవిశంకర్తో ప్రేమలో పడింది. పెద్దల అంగీకారంతో ఎనిమిది నెలల క్రితం అతన్ని పెళ్లి చేసుకుంది.
రవిశంకర్ విజయవాడలోని ఓ స్టీల్ దుకాణంలో పనిచేస్తుంటాడు. వీరు మహానాడు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఇంటి ముందు జ్యోతి కుప్పకూలిపోవడంతో భర్త రవిశంకర్ మణిపాల్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు.
వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే మరణించినట్లు తేల్చారు. కాగా, తన కూతురు జ్యోతిని కట్నం కోసం వేధింపులకు గురి చేశారని తండ్రి తాళ్లూరి శ్రీనివాస రావు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కులం పేరుతో తన కూతురిని దూషించేవారని, తన కూతురిని విషమిచ్చి చంపారని వారు ఆరోపించారు.
Comments
English summary
A married woman has dead in suspecious conditions in Krishna district.
Story first published: Thursday, February 13, 2014, 8:32 [IST]