వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ బాధపెట్టాడు: టిడిపిలోకి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్. కర్నూలు జిల్లాలో వైసిపి ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఈ నెల 7వ తేదీన టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమైంది.

ఎస్వీ మోహన్ రెడ్డి టిడిపిలో చేరుతారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిల ప్రియ టిడిపిలో చేరిన సమయంలోనే ఎస్వీ మోహన్ రెడ్డి పేరు వినిపించింది. ఇప్పుడు ఆయన చేరిక ఖరారయిందని తెలుస్తోంది. 7న చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరనున్నారు.

ఎస్వీ మోహన్ రెడ్డి తన అనుచరులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమాలోచనలు జరిపి ఈ నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, దిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఈ నెల 16నుంచి కర్నూలులో మూడు రోజులపాలు వైసిపి అధినేత జగన్‌ నిరాహార దీక్ష చేయనున్నారు.

ఈ దీక్షకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ప్రకటించారని, ఇది ఎస్వీ మోహన్ రెడ్డిని మనస్తాపానికి గురి చేసిందని తెలుస్తోంది. దీనిని అవమానంగా భావించారని అంటున్నారు. పత్రికలు, టీవీల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నారు. దీంతో ఆయన సైకిల్ ఎక్కాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

ఎస్వీ మోహన్ రెడ్డి

ఎస్వీ మోహన్ రెడ్డి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్. కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఈ నెల 7వ తేదీన టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమైంది.

టిడిపిలోకి వైసిపి నేతలు

టిడిపిలోకి వైసిపి నేతలు

కర్నూలు జిల్లాకు చెందిన పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో బెజవాడలో టిడిపిలో చేరారు.

టిడిపిలోకి వైసిపి నేతలు

టిడిపిలోకి వైసిపి నేతలు

కర్నూలు జిల్లాకు చెందిన పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు టిడిపిలో చేరారు. కర్నూలు జిల్లాలో వైసిపికి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.

టిడిపిలోకి వైసిపి నేతలు

టిడిపిలోకి వైసిపి నేతలు

కర్నూలు జిల్లాకు చెందిన పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు టిడిపిలో చేరారు. జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉంటే, 11మంది వైసిపి నుంచి గెలుపొందారు. ఇప్పటికే సగం మందికి పైగా చేరారు.

English summary
YSR Congress Party MLA SV Mohan Reddy will join Telugudesam Party on 7th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X