నా సీటు ఆంధ్రా గర్ల్కని కన్నీరు పెట్టిన ప్రవీణకు న్యాయం
హైదరాబాద్: తెలంగాణ దంత వైద్యశాల విద్యార్థిని ప్రవీణ నాయక్ నిరాహార దీక్ష పైన తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తన సీటు ఆంధ్రా విద్యార్థినికి ఇచ్చారని, తనకు న్యాయం చేయాలని ప్రవీణ నాయక్ నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం మంగళవారం స్పందించింది.
ప్రవీణ నాయక్ కోరుకున్న ఖమ్మంలోని మమత వైద్య కళాశాలలో పీజీ డెంటల్ సీటుకయ్యే పూర్తి ఖర్చును భరించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మంగళవారం ఉదయం నుండి ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య, ఆ శాఖ ముఖ్య కార్యదర్శఇ ఎస్కే జోషీ, ఇతర ఉన్నతాధికారులు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి.

డెంటల్ పీజీ ప్రవేశ పరీక్షలో ఎస్టీ కేటగిరీలో మొదటి ర్యాంకు సాధించిన తెలంగాణ విద్యార్థిని ప్రవీణ నాయక్కు సీటు దక్కక పోవడంతో వివాదం మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి న్యాయం చేయాలని వేడుకుంది. స్పందించిన సీఎం ఈ వ్యవహారం పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించడంతో ఆమెకు న్యాయం జరిగింది.













Click it and Unblock the Notifications