సొంత జిల్లాలో జగన్కు షాక్: డీసీసీబీ టీడీపీ వశం
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లా కడపలో ఎదురు దెబ్బ తగిలింది. కడప డీసీసీబీ చైర్మన్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. డీసీసీబీ చైర్మన్గా వీర శివా రెడ్డి తనయుడు అనిల్ కుమార్ రెడ్డి ఎన్నికయ్యారు.
కో ఆప్షన్ సభ్యులతో కలిపి తెలుగుదేశం పార్టీకి 12 మంది డైరెక్టర్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 9 మంది డైరెక్టర్లు ఉన్నారు. దీంతో, డీసీసీబీ చైర్మన్గా అనిల్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ సీఎం రమేష్ తదితరులు హాజరవుతారు.

ఆదివారం ఉదయం ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాగానే ముందుగా కో-ఆప్సన్ సభ్యులను ఎన్నుకున్నారు. వారిలో ముగ్గురు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు. దాంతో చైర్మన్ అభ్యర్థిగా అనిల్ రంగంలోకి దిగారు.
ఇప్పటికే ముగ్గురు డైరక్టర్లు టీడీపీలోకి ఫిరాయించడంతో మెజారిటీ లేక మిగతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లు కూడా ఎన్నిక నుంచి వెళ్లిపోయారు. దీంతో కడప డీసీసీబీ ఏకగ్రీవంగా టీడీపీ ఖాతాలో పడింది. కాసేపట్లో డీసీసీబీ ఛైర్మన్గా అనిల్ కుమార్ రెడ్డిని అధికారికంగా ప్రకటించనున్నారు.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications