ఏం పిల్లడో హోదా ఇయ్యవా.. వంగపండు అవతారమెత్తిన ఎంపీ శివప్రసాద్.. రామ్మోహన్ నిరాహార దీక్ష
ఢిల్లీ : టీడీపీ ఎంపీల నిరసనతో పార్లమెంట్ ఆవరణ దద్ధరిల్లింది. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులు చేతబట్టి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ తో పాటు విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మరో వేషాధారణతో నిరసన గళం వినిపించారు. జానపద సుప్రసిద్ధుడు వంగపాడు వేషంతో ఫోక్ సాంగ్స్ పాడుతూ తనదైన శైలిలో మోడీపై ఆరోపణాస్త్రాలు సంధించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ నినదించారు. ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం నిరంకుశ వైఖరి అవలంభిస్తోందని మండిపడ్డారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నిరాహార దీక్షకు దిగారు. విభజన హామీల విషయంలో కూడా నిర్లక్ష్య ధోరణ అవలంభిస్తోందని ఆరోపించారు. ఈరోజు (మంగళవారం) పార్లమెంట్ సమావేశాలు ముగిసేవరకు దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. అయితే ఇవాళ ఆయన పుట్టినరోజు కావడం విశేషం.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications