వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ టీడీపీ నాయకుడు..
సత్తెనపల్లిలోని డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ గృహంలో ముప్పాళ్ల మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రావిపాటి మధుబాబు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు.
సత్తెనపల్లి: పార్టీకి మచ్చ తెచ్చే పనులతో కొంతమంది టీడీపీ నాయకులు వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ టీడీపీ నాయకుడు వ్యభిచారం కేసులో పట్టుబడటం కలకలం రేపుతోంది.
సత్తెనపల్లిలోని డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ గృహంలో ముప్పాళ్ల మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రావిపాటి మధుబాబు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. మధుబాబుతో పాటు ఇద్దరు యువతులను, నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించినట్టు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.













Click it and Unblock the Notifications