రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై టిడిపి ఇలా, ఆగండి.. ఏపీ నేతలకు బాబు ఆదేశం?
ఏపీ టిడిపి నేతలపై ఘాటు వ్యాఖ్యలు, పొత్తులపై తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టిడిపి అధిష్టానం స్పందించింది.తెలంగాణలో పొత్తుల గురించి ఎవరు మాట్లాడినా అది వ్యక్తిగతమే అన్నార
Recommended Video

హైదరాబాద్: ఏపీ టిడిపి నేతలపై ఘాటు వ్యాఖ్యలు, పొత్తులపై తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టిడిపి అధిష్టానం స్పందించింది.
తెలంగాణలో పొత్తుల గురించి ఎవరు మాట్లాడినా అది వ్యక్తిగతమే అన్నారు. అది పార్టీ అభిప్రాయం కాదని తేల్చి చెప్పారు. పొత్తులపై సరైన సమయంలో అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయిస్తారన్నారు.

హైదరాబాదులో జరిగిన సమావేశంలో కేడర్ను కాపాడుకోవడం, సమస్యలపై పోరాడటం పైనే చర్చించామని టిడిపి ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు మౌనంగానే ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించవద్దని ఏపీ టీడీపీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
ఏపీ టీడీపీ నేతలపై రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ వారికి పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇచ్చారని చెప్పారు. ఈ నేపథ్యంలో అప్పుడే స్పందించవద్దని అధినేత ఆదేశించారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications