పచ్చ చొక్కా వేసుకోలేదని...టిడిపి కార్యకర్తల నుంచి ఫైన్ వసూలు...ఎక్కడంటే
విశాఖపట్టణం జిల్లా: తన నియోజకవర్గం పరిధిలో ఏ స్థాయి పార్టీ సమావేశాలకు అయినా టిడిపి శ్రేణులు తప్పనిసరిగా పసుపు చొక్కాలతో రావాలని మాడుగుల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గం ఇన్చార్జి గవిరెడ్డి రామానాయుడు స్పష్టం చేశారు. ఆ ప్రకారం బుధవారం చీడికాడ, కె.కోటపాడు పార్టీ సమావేశాలకు పచ్చ చొక్కా వేసుకోకుండా వచ్చిన పార్టీ కార్యకర్తలు,మద్దతుదారుల నుంచి ఆయన నిలబెట్టి ఫైన్ వసూలు చెయ్యడం కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే...బుధవారం మాడుగుల నియోజకవర్గం పరిధిలోని చీడికాడ, కె.కోటపాడులో ఆ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి గవిరెడ్డి రామానాయుడు ఆధ్వర్యంలో పార్టీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు పచ్చ చొక్కాలు వేసుకోకుండా వచ్చినందుకు 28 మంది టిడిపి కార్యకర్తల నుంచి వంద రూపాయల చొప్పున రూ.2,800 జరిమానాగా వసూలు చేశారు. ఈ ఫైన్ చెల్లించిన వారిలో చీడికాడ మండలానికి చెందినవారు 18 మంది ఉండగా, కె.కోటపాడు మండలం నుంచి 10 మంది అపరాధ రుసుం చెల్లించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి గవిరెడ్డి రామానాయుడు మాట్లాడుతూ ఈనెలలోనే 18 వ తేదీన జరిగే నియోజవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి, ఈ తరువాత మార్చి నెలలో జరిగే సమావేశాలకు పార్టీ శ్రేణులు పసుపు చొక్కాలు వేసుకోకుండా వస్తే రాకుంటే జరిమానా మరింత పెంచాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలా వసూలు చేసిన అపరాధ రుసుమును పార్టీ కార్యాలయానికే వినయోగిస్తామన్నారు. చీడికాడ పార్టీ కార్యాలయంలో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.10 వేలు ఇస్తానన్నారు. మిగిలిన వారు విరాళాలు వేసుకొని మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కె.కోటపాడులో సోషల్ మీడియా పోస్టర్లును ఆయన ఆవిష్కరించారు.
అయితే పార్టీ కార్యకర్తల నుంచి జరిమానా వసూళ్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కొందరు కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చెయ్యగా మరికొందరు మాత్రం క్రమశిక్షణ కోసం ఈ తరహా చర్యలు తప్పవని సమర్థించారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
విశాఖలో కుమారస్వామి- స్టీల్ ప్లాంట్ రోడ్ మ్యాప్ ఆయన చేతిలో -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications