ఏపీలో కూటమికి వచ్చే సీట్లివే.. టీడీపీ ఉగాది పంచాంగ శ్రవణంలో జోస్యం..!
ఏపీలో ఉగాది సంబరాలు మిన్నంటుతున్నాయి. తెలుగు వారి కొత్త ఏడాది క్రోధ నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా రాజకీయ పార్టీల కార్యాలయాల్లోనూ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో పంచాగ శ్రవణాలు కూడా ఏర్పాటు చేసి ఈ ఏడాది తమకు ఎలా ఉండబోతోందో చెప్పించుకుంటున్నారు. ఇదే క్రమంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణంలో అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఉగాది వేడుకల్లో చంద్రబాబుకు వేద పండితులు ఉగాది పచ్చడి అందించారు. పంచాగకర్త మాచిరాజు వేణుగోపాల్ నేతృత్వంలో పంచాంగ శ్రవణం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ..చంద్రబాబుకు ఈ ఏడాది కలిసి వస్తుందన్నారు. చంద్రబాబుకు అధికార యోగం ఉందని తెలిపారు. త్రిమూర్తులు కలయికతో ఏపీకి మేలు జరుగుతోందని వెల్లడించారు. బ్రహ్మ - మోడీ, విష్ణువు - పవన్, ఈశ్వరుడు - చంద్రబాబుగా ఆయన అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయే కూటమికి 128 అసెంబ్లీ స్థానాలు, 24 పార్లమెంట్ స్థానాలు వస్తాయన్నారు. అలాగే చంద్రబాబు అమరావతి నిర్మాణం చేపడతారన్నారు.

అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. తెలుగు ప్రజలకు క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమిగా కలసి వస్తున్నామన్నారు. వైసీపీ వ్యతిరేక ಓటు చీలకూడదని కూటమిగా వస్తున్నామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం అవసరమన్నారు. సూపర్ సిక్స్ తోపాటు త్వరలోనే ఎలక్షన్ మ్యానిఫెస్టో తీసుకు వస్తామని తెలిపారు.

ప్రజలపై అప్పుల భారం లేకుండా మెరుగైన సంక్షేమం అందించేలా ముందుకెళ్తామన్నారు. కనీసం తాగునీళ్లు ఇవ్వలేని సీఎం...మూడు రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications