అప్లికేషన్ కాపీ చేసిన బాబు ప్రభుత్వం: పోలీసులకు టి ఫిర్యాదు
విజయవాడ/హైదరాబాద్: తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మరో వివాదం తెర పైకి వచ్చింది. ఇప్పటికే నీటి తగాదాలు వేడిని రాజేస్తున్నాయి. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ఆస్తుల వివాదం కొనసాగుతోంది. మరికొన్ని తగాదాలు ఉన్నాయి. తాజాగా, పరిశ్రమల శాఖ వివాదం తెరపైకి వచ్చింది.
రెచ్చగొట్టొద్దు: దత్తాత్రేయ, రంగంలోకి కేంద్రం, బాబు-కేసీఆర్లతో భేటీ!
తెలంగాణ పరిశ్రమల శాఖ వెబ్సైట్ను కాపీ చేశారంటూ సైబర్ క్రైమ్లో తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసింది. కాపీరైట్ యాక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎందుకు చర్చించుకోరు?: కేసీఆర్, బాబులకు నారాయణ సూటి ప్రశ్న
తమ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆన్ లైన్ అప్లికేషన్ను ఏపీ ప్రభుత్వం కాపీ చేసిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. తాము తయారు చేసిన ఆన్ లైన్ అప్లికేషన్ పార్మాట్ను ఏపీ ప్రభుత్వం మక్కీకి మక్కీ తస్కరించిందని తమ ఫిర్యాదులో పేర్కొంది. ఫార్మాట్లో తెలంగాణ అని ఉన్నచోట ఏపీ అని పెట్టారని పేర్కొంది.
రేపు సాయంత్రం చంద్రబాబుతో గవర్నర్ భేటీ
రేపు (బుధవారం) సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబుతో గవర్నర్ భేటీ కానున్నారు. రేపు రాత్రికి గవర్నర్ అక్కడే బస చేయనున్నారు. హైకోర్టు విభజన, ఇతర తెలుగు రాష్ట్రాల సమస్య పైన ఆయన చంద్రబాబుతో చర్చించనున్నారని తెలుస్తోంది.