గోల్కొండలో స్వాతంత్ర్య వేడుకలు బాధాకరం: ఎర్రబెల్లి
వరంగల్/మెదక్: గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం బాధాకరమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుది తుగ్లక్ పాలన అని మండిపడ్డారు.
కెసిఆర్ మాయమాటలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కెసిఆర్ వెంటనే అమలు చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.
యావద్దేశ దృష్టిని ఆకర్షిస్తున్నారు: కెసిఆర్పై హరీశ్
మెదక్: తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం మనందరికీ గర్వకారణమని మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం.. అనుకున్నది సాధించామని తెలిపారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయాలు యావద్దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. ప్రజలందరికీ ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలను తెస్తోందని తెలిపారు.