తెలుగు టీవీ సీరియల్ నటి దీప్తి ఆత్మహత్య
న్యూఢిల్లీ: బుల్లితెరకు చెందిన మరో నటి ఆత్మహత్య చేసుకుంది. పలు టీవీ సీరియల్స్లో నటిస్తూ మంచి గుర్తింపు, పేరు తెచ్చుకున్న దీప్తి అలియాస్ రామలక్ష్మి శనివారం ఉదయం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
హైదరాబాద్, బాలానగర్ సమీపంలోని ఫతేనగర్లోని ఒక అపార్టుమెంట్లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆమె మరణానికిగల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసుకు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రేమికుల రోజున ఆమె ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అపార్టుమెంట్లో దీప్తి శుక్రవారం అర్ధరాత్రి తన గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలను తీసుకుంది. ఈ విషయాన్ని గమనించిన అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. పశ్చిగోదావరి జిల్లా తణుకుకు చెందిన దీప్తి ఆడదే ఆధారం, ఆహ్వానం, లక్కీ లక్ష్మి తదితర సీరియళ్లలో నటించింది.
హైదరాబాద్ నగరంలోని మల్కాజ్గిరిలో విషాదం చోటు చేసుకుంది. ఆనంద్బాగ్లో రైల్వే వంతన కోసం తీసిన గుంతలో ఓ మహిళ పడి మృతి చెందింది. దీంతో అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications