గెయిల్ ట్రాజెడీ: నగరం శ్మశానం, 17కు చేరిన మృతులు
రాజమండ్రి: గెయిల్ పైప్ లైన్ పగిలి సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామం శ్మశానాన్ని తలపిస్తోంది. మనుషులు, పక్షులు, జంతువులు కాలి బుడిదైపోయి శ్మశాన వాతావరణాన్ని తలపిస్తోంది.
గెయిల్ ప్రమాదంలో మరణించినవారి సంఖ్య శనివారంనాడు 17కు చేరుకుంది. గాయపడినవారు రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడినవారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. బాధితులు తల్లిడిల్లిపోతున్నారు. పరిస్థితి అత్యంత విషాదకరంగా ఉంది.

మంటలు చుట్టుముట్టాయి
గెయిల్ గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో లేచిన మంటలు చాలా దూరం వ్యాపించాయి. దీంతో నగరం గ్రామంలో మనుషులే కాదు పశుపక్ష్యాదులు కూడా మృత్యువాత పడ్డాయి.

కొబ్బరి తోటలు ఖతమ్
పచ్చని కోనసీమలో మంటలు చిచ్చుపెట్టాయి. కొబ్బరి తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రజలు దిక్కు తోచని స్థితిలో పడ్డారు.

వ్యాపించిన అగ్నికీలలు
గ్యాస్ పైప్ లైన్ లీకయి మంటలు లేవడంతో దారుణమైన ప్రమాదం చోటు చేసుకుంది. 16 మంది మృత్యువాత పడ్డారు.

చెట్లూ చేమలు బూడిద
పచ్చిన తోటలు, చెట్లు బూడిద పాలయ్యాయి. నగరం గ్రామం శ్మశానంగా మారిపోయింది. పరిస్థితి దారుణంగా ఉంది.

చంద్రబాబు సూచన
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పరామర్శించారు.

చంద్రబాబు పరామర్శ
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను చంద్రబాబు పరామర్శించి, ఉత్తమ చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

వ్యాపించిన మంటలు
గ్యాస్ పైప్ లైన్ లీకయి చెలరేగిన మంటలు నగరం గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. వారు పరుగులు తీశారు.

నగరం గ్రామం శ్మశానం
తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామం శ్మశానంగా మారిపోయింది. ప్రజలు చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారు.

క్షతగాత్రుల కోసం అంబులెన్స్
క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడానికి అంబులెన్స్ వాహనం వచ్చింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

సహాయక చర్యలు
మంటలకు ఆహుతి అయిన నగరం గ్రామంలో సహాయక చర్యలు ఇలా కొనసాగాయి. మృతులు గుర్తు పట్టనరాతంగా కాలిపోయారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications