Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంక్రాంతికి ముందే ఆర్టీసీ ఉద్యోగులకు పెద్ద పండుగ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో apsrtc పైన ప్రభుత్వం ఫోకస్ చేసి, దానిని ప్రగతి పదంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తోంది. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న నాటినుండి మరింత దృష్టి సారిస్తున్న ఏపీ సర్కార్ ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులకు తాజాగా తీపి కబురు చెప్పింది. ఆర్టీసీ అధికారుల పదోన్నతులకు సంబంధించి కీలక విధాన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.

ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులపై తీపి కబురు
ఇకపై డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ పదోన్నతులకు సంబంధించి మెరిట్ రేటింగ్ రిపోర్ట్ లతోపాటు, వార్షిక రహస్య నివేదికలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. గతంలో కేవలం ఎం ఆర్ ఆర్ ల ఆధారంగానే పదోన్నతులు కల్పించేవారు. అయితే ఈ కొత్త నిబంధనలతో ఆ విధానం మారుతుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఒక భాగం కావడంతో ఇక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే నిబంధనలను అమలు చేస్తున్నారు.

This is no ordinary good news regarding RTC promotions and leaves

పదోన్నతులకు ప్రభుత్వ విధానం ఇదే
ఈ నేపథ్యంలోనే వార్షిక రహస్య నివేదికలను పదోన్నతులకు సంబంధించి పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ముఖ్యంగా ఈ మార్పు మొదటి స్థాయి గెజిటెడ్ అధికారుల పదోన్నతులకు వర్తిస్తాయి. వరుసగా నాలుగు ప్యానెల్ ఇయర్స్ లో అధికారుల ఎం ఆర్ ఆర్ మరియు ఏ సి ఆర్ లను కలిపి పరిశీలించడం ద్వారా పారదర్శకతను సమగ్ర పనితీరు అంచనాను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

దశలవారీ మార్పులు చేపట్టిన ఏపీ ప్రభుత్వం
దశల వారీ మార్పులను చేపట్టిన ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా ఆర్టీసీ పదోన్నతుల విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి పనితీరు పైన సమీక్ష చేయడంతో పాటు, ఉద్యోగి వార్షిక రహస్య నివేదిక ఆధారంగా ప్రమోషన్ లను ఇవ్వనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గత ఐదేళ్లలో నాలుగేళ్ల మెరిట్ రేటింగ్ రిపోర్ట్, వార్షిక రహస్య నివేదిక లను ఆధారంగా తీసుకుంటారు.

ఆర్టీసీ విషయంలో మరో కీలక నిర్ణయం
ఇక 2026 - 27 లో మూడేళ్ల రిపోర్టులు, 2027 - 28 లో రెండేళ్ల రిపోర్టులు, 2028 - 29 లో ఒక సంవత్సరం రిపోర్టుతో పాటు నాలుగేళ్ల రిపోర్టులను పరిశీలిస్తారు. 2029 - 30 ఆర్థిక సంవత్సరం నుండి కేవలం ఐదేళ్ల ఏసీఆర్ లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.ఇక ఇది మాత్రమే కాకుండా ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఆర్టీసీ ఉద్యోగులకు వచ్చే ఏడాది 16 సెలవులు
ఆర్టీసీ వర్క్ షాప్ లో పనిచేసే ఉద్యోగులకు వచ్చే ఏడాది 16 సెలవులను మంజూరు చేస్తుంది. ముఖ్యంగా విజయవాడ, నెల్లూరు, కడప, విజయనగరం జోనల్ వర్క్ షాప్ లలో స్టోర్స్ మరియు టైర్ రీ ట్రేడింగ్ షాపులలో పనిచేసే ఉద్యోగులకు ఈ అదనపు సెలవులు వర్తించేలాగా ప్రకటించింది. అలాగే ట్రాఫిక్, గ్యారేజ్ విభాగాలలో పనిచేసే వారికి ఐదురోజుల సెలవులను ఖరారు చేసింది. ఇక ఈ సెలవులను మంజూరు చేయడం పట్ల కూడా ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+