వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలుకు ఎదురుగా వెళ్లి ప్రేయసీప్రియుల ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడియం రైల్వేట్రాక్‌పై శుక్రవారం ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజమండ్రి గుత్తుల వారివీధి ఆల్కాట్‌ గార్డెన్స్‌కు చెందిన పాలకుర్తి శ్రీనివాస్‌(28) పెయింటింగ్‌ పనులు చేస్తుంటాడు. శ్రీనివాస్‌కు వివాహమై భార్య, పిల్లలు ఉన్నారు.

శ్రీనివాస్‌కు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం బ్రిడ్జిపేటకు చెందిన చెల్లం కమలకుమారి(25)తో పరిచయం ఏర్పడింది. దీంతో తనకు న్యాయం చేయాలని శ్రీనివాస్‌ భార్య రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు మనస్తాపం చెంది కడియం వచ్చారు. రైలుకు ఎదురుగా వెళ్లి శ్రీనివాస్, కమలకుమారి మృత్యువును ఆహ్వానించారు.

East Godavari map

అక్కడ రైల్వే ట్రాక్‌పై వస్తున్న రైలుకు ఎదురుగా నడుచుకుంటూ వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి మృతదేహాలు ముక్కలు ముక్కలుగా పడిపోయాయి. ఈసంఘటన చూపరులను కలచివేసింది. సంఘటనా స్థలాన్ని రాజమండ్రి రైల్వే పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివాహిత ఆత్మహత్య

బలభద్రపురంనకు చెందిన స బ్బెళ్ల వీరలక్ష్మి(46)కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బిక్కవో లు ఏఎస్‌ఐ ఎంవిఆర్‌ రెడ్డి వివరాలు అందించారు. వీరలక్ష్మి గతఏడాది రైలు నుంచి జారిపడి అనారోగ్యానికి గురైంది. దీంతో కూలిపనిచేసే భర్త ఆమె వైద్యానికి ఇబ్బందులు పడుతుండడంతో వీరలక్ష్మి మనస్తాపం చెంది గురువారం ఉదయం బాత్‌రూంలో కిరోసిన్‌పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆమెను భర్త కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందిందని దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వివరించారు.

English summary
Three persons commited suicide in East Godavari district. Two persons commited suicide on railway track.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X