ఎపిలో ఎదురుకాల్పులు: ముగ్గురు మావోల హతం
గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఈ ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం అందుతోంది. ప్రకాశం జిల్లా పుల్లెలచెరువు మండలం శతకోడు వద్ద పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. సంఘటనా స్థలంలో ఎకె 47, ఎస్ఎల్ఆర్, ఇతర సామాగ్రి లభ్యమైనట్లు సమాచారం. మృతి చెందిన మావోయిస్టులను జానా బాబూరావు, శారద, విమలక్కలుగా గుర్తించారు. జానా బాబూరావు డిప్యూటీ కమాండర్ అని తెలుస్తోంది. పోలీసులు మోస్ట్ వాంటెడ్ జాబితాలో జానా బాబూరావు ఉన్నట్లు చెబుతున్నారు.
ఎదురుకాల్పుల విషయాన్ని ఇటు గుంటూరు జిల్లా ఎస్పీ గానీ, అటు ప్రకాశం జిల్లా ఎస్పీ గానీ ధ్రువీకరించడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఈ స్థాయిలో ఎదురు కాల్పులు జరగడం ఇదే ప్రథమం
తాజా సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు పెరిగాయా అనే అనుమానాలకు తావిస్తోంది. నల్లమలలో దళాలను పెంచాలనే ప్రయత్నాల్లో జానా బాబూరావు ఉన్నట్లు చెబుతున్నారు.