తిరుమల లడ్డూ వివాదం: డ్యామిడ్.. చంద్రబాబు కథ అడ్డం తిరిగింది!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డు కల్తీ జరిగిందని చేసిన వ్యాఖ్యల దుమారం నేటికీ కొనసాగుతూనే ఉంది . తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన సుప్రీంకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయుధం ఇచ్చినట్లుగా మారింది. తిరుమల లడ్డూ విషయంలో డ్యామిడ్ చంద్రబాబు కథ అడ్డం తిరిగింది.
చంద్రబాబును టార్గెట్ చేసిన వైసీపీ
తిరుమల లడ్డు కల్తీ పై చేపట్టిన విచారణలో సుప్రీం ధర్మాసనం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను చాలా తీవ్రంగా పరిగణించడం, దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచమని వ్యాఖ్యానించడం, కల్తీ నెయ్యి విషయంలో ప్రభుత్వానికి ఆధారాలు కావాలంటూ పలు ప్రశ్నలు సంధించడంతో ఇప్పుడు వైసీపీ చేతికి అది ఆయుధంగా మారింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందువుల మనోభావాలను దెబ్బతీసింది చంద్రబాబు అంటూ చంద్రబాబును టార్గెట్ చేస్తుంది.

ఎక్స్ ఖాతాలో వైసీపీ పోస్ట్
వైసిపి ఎక్స్ అధికారిక ఖాతాలో దీనిపైన స్పందిస్తూ తిరుమల లడ్డు విషయంలో నోరు జారిన చంద్రబాబు పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, కల్తీ నెయ్యి వాడినట్టు సరైన ఆధారాలు లేకపోయినా చంద్రబాబు బహిరంగ ప్రకటన చేయడం పైన మండిపడిందని పేర్కొంది. రాజ్యాంగ పరిధిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా అంటూ సుప్రీం ధర్మాసనం చంద్రబాబుకి అక్షింతలు వేసిందని పేర్కొంది.
తిరుమల లడ్డూ విషయంలో నోరుజారిన చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
— YSR Congress Party (@YSRCParty) October 1, 2024
కల్తీ నెయ్యి వాడినట్లు సరైన ఆధారాలు లేకపోయినా.. బహిరంగ ప్రకటన చేయడంపై మండిపడింది.
రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా? అంటూ అక్షింతలు వేసింది
కనీసం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని… pic.twitter.com/JrgEpVyeMq
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
కనీసం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసింది. ఇక సత్యమేవ జయతే అంటూ ఒక పోస్టును కూడా పెట్టి చంద్రబాబును టార్గెట్ చేసింది. ఇక తిరుమల ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వరస్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
సుప్రీం ప్రశ్నలకు సమాధానం చెప్పు చంద్రబాబు.. నిలదీసిన మాజీ మంత్రి
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం స్థాయి వ్యక్తి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టిందని, కల్తీ నెయ్యి పైన సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది అని, జూలై 23 నుంచి సెప్టెంబర్ 18వరకు ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు ఇప్పుడు ఎందుకు మాట్లాడారు అన్న విషయాన్ని కూడా సుప్రీం ధర్మాసనం నిలదీసిందని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సుప్రీం ప్రశ్నలకు సమాధానం చెప్పు చంద్రబాబు అని ప్రశ్నించారు.
సుప్రీం జడ్జితో పూర్తి విచారణ జరగాలని డిమాండ్
కల్తీ నెయ్యి వ్యవహారంలో వాస్తవాలు త్వరలోనే బయటపడతాయని, అసలు ఈ మొత్తం వ్యవహారం పైన సుప్రీంకోర్టు జడ్జి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అటు సుప్రీం ధర్మాసనం మాత్రమే కాదు తాము కూడా భగవంతుని రాజకీయాల్లోకి లాగొద్దని చెబుతున్నామని చంద్రబాబుకు సూచించారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications