తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు - శ్రీవారి దర్శనం :సేవల రద్దు..!!

తిరుమలలో నేటి నుంచి సాల‌క‌ట్ల తెప్పోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఫిబ్రవరి మాసంలో 114.29 కోట్ల హుండీ ఆదాయం టీటీడీకి సమకూరింది

Tirumala: తిరుమలలో గడిచిన ఫిబ్రవరి మాసంలో 114.29 కోట్ల హుండీ ఆదాయం టీటీడీకి సమకూరింది. ఫిబ్రవరి నెలలో 18.42 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 92.96 లక్షల లడ్డూలు పంపిణీ చేసినట్లు టీటీడీ ప్రకటించింది. 7.21 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. 34.06 అన్న ప్రసాదం స్వీకరించినట్లు వెల్లడించారు. జూలై 2022లో తిరుమల హుండీ ఆదాయం రూ 139 కోట్లు కాగా, గత నెలలో అంతకు మించి హుండీ ఆదాయం భక్తుల నుంచి వచ్చింది. 2022 సంవత్సరంలో తిరుమల హుండీ ద్వారా రూ 1450.41 కోట్లు మేర సమకూరింది.

నేటి నుంచి సాల‌క‌ట్ల తెప్పోత్స‌వాలు

నేటి నుంచి సాల‌క‌ట్ల తెప్పోత్స‌వాలు

తిరుమలలో నేటి నుంచి సాల‌క‌ట్ల తెప్పోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఐదు రోజుల‌పాటు ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఐదు రోజుపాటు ఈ తెప్పోత్స‌వాల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఉత్సవాల వేళ టీటీడీ వివిధ సేవ‌ల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. రాత్రి 7 గంట‌ల నుండి 8 గంట‌ల వ‌ర‌కు పుష్క‌రిణిలో స్వామి, అమ్మ‌వారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం లభించనుంది. తెప్పొత్స‌వాల్లో భాగంగా తొలిరోజు శ్రీ సీతాల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ స‌మేతంగా స్వామివారు శ్రీరామ‌చంద్ర‌మూర్తి అవతారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఉంటుందని అధికారులు వెల్లడించారు. పుష్క‌రిణి చుట్టూ ఊరేగింపుగా భ‌క్త‌ల‌కు ద‌ర్శ‌నం ఇస్తారు. రెండో రోజు శ్రీకృష్ణుడి అవ‌తారంలో స్వామివారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.
సేవలను రద్దు చేస్తూ నిర్ణయం

సేవలను రద్దు చేస్తూ నిర్ణయం


మార్చి 3,4 తేదీల్లో తోమాల సేవ‌ను, ఆర్చ‌న‌, స‌హ‌స్ర‌దీపాలంక‌ర‌ణ సేవ‌ను, అదేవిధంగా మార్చి 5,6 తేదీల్లో తోమాల సేవ‌, అర్చ‌న‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంక‌ర‌ణ సేవ‌ల‌ను, మార్చి 7వ తేదీన ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంక‌ర‌ణ సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇదే సమయంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శన కోసం భక్తులు 10 కంపార్ట్‎మెంట్లలో వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పట్టనుంది. గురువారం శ్రీవారిని 60,682 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 24,292 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

తాజా నిర్ణయంతో భక్తులకు మేలు

తాజా నిర్ణయంతో భక్తులకు మేలు

తాజాగా అమలు చేస్తున్న ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ గురించి ఈవో ధర్మారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తిరుమలలోని గదులు కేటాయించే కేంద్రాలు, ఉప విచారణ కార్యాలయాలను ఈవో అధికారులతో కలిసి పరిశీలించారు. గదుల కొరకు పేర్లు నమోదు చేసుకున్న భక్తులకు త్వరితగతిన రూములు దొరుకుతున్నాయని తెలిపారు. రెండవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఉచిత లడ్డు టోకెన్లు ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఈ పరిజ్ఞానం ద్వారా లడ్డు ప్రసాదాలలో దళారి వ్యవస్థను కట్టడి చేయవచ్చని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+