దీపావళి వేళ ఏపీలో విషాదం.. బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగుపాటు, ఇద్దరు మృతి!
దీపావళి వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. దీపావళి పండుగ ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలు సిద్ధమవుతున్న వేళ ఊహించని విషాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బాణసంచా తయారీ కేంద్రం సమీపంలో పిడుగు పడి ఒక్కసారిగా బాణా సంచా తయారీ కేంద్రంలో మంటలు ఎగసి పడ్డాయి.
బాణా సంచా తయారీ కేంద్రంపై పిడుగుపాటు
బాణా సంచా తయారీ కేంద్రం పై పిడుగు పాటు ధాటికి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈరోజు తూర్పు గోదావరి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న నేపధ్యంలో ఒక్కసారిగా పిడుగులు పడటంతో ఊహించని ఘోరం చోటు చేసుకుంది. పిడుగు పడటంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా బాణా సంచా పేలుడు సంభవించింది.

ఇద్దరు మృతి, 10 మందికి గాయాలు
ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన ఇద్దరు మహిళలు బాణా సంచా తయారీ కేంద్రంలో పని చేస్తున్న వారిగా తెలుస్తుంది. ఒక్కసారిగా బాణా సంచా తయారీ కేంద్రంలో పిడుగు పడటంతో అక్కడ పని చేస్తున్న కూలీలు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ఈ ఘటనలో 10మంది గాయపడ్డారు. గాయపడిన వారిని తణుకు ఆస్పతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
ప్రస్తుతం అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటన పైన ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బాణసంచా తయారీ కేంద్రం సమీపంలో పిడుగుపాటు ధాటికి ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్
మృతుల కుటుంబాలకు వైయస్ జగన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంటలు చెలరేగి గాయాల పాలైన బాధితులకు తక్షణమే మైరుగైన వైద్యసదుపాయాలు అందించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications