క్షమాపణ: మట్టి బొమ్మలు Vs ఎన్టీఆర్పై చెప్పులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు మట్టి బొమ్మల వ్యాఖ్యలపై ఐదు నిమిషాల అనంతరం శాసన సభ ప్రారంభమయ్యాక కూడా కాసేపు గందరగోళం ఏర్పడింది. ట్యాంకుబండు పైన విగ్రహాలను మట్టి విగ్రహాలు అన్నందుకు కెటిఆర్ క్షమాపణలు చెప్పాలని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నినాదాలు చేసింది.
దీనిపై కెటిఆర్ స్పందిస్తూ.. తాము మహనీయులకు వ్యతిరేకం కాదని కానీ, తెలంగాణ కోసం అంతమంది విద్యార్థులు చనిపోతే, తెలంగాణ తల్లులు కంట నీరు పెట్టినప్పుడు ఈ సభ ఎందుకు భరోసా ఇవ్వలేదని ప్రశ్నించారు. ట్యాంకుబండు విగ్రహాలను ఏర్పాటు చేసిన కమిటీలో కెసిఆర్ సభ్యుడైనప్పటికీ ఈ సీమాంధ్ర ప్రభుత్వాల్లో తెలంగాణ మంత్రులకు, నాయకులకు స్వేచ్ఛ లేదన్నారు.

దూళిపాళ్ల స్పందన
ట్యాంకుబండు పైన కేవలం సీమాంధ్ర వారి విగ్రహాలే లేవని, రుద్రమదేవి, సురవరం, మొయినుద్దీన్, తానిషా, బమ్మెర పోతన వంటి వారి విగ్రహాలు ఉన్నాయన్నారు. విగ్రహాల కమిటీకి సి నారాయణ రెడ్డి చైర్మన్ అయితే, కెసిఆర్ సభ్యులుగా ఉన్నారన్నారు. మట్టి బొమ్మల వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పేందుకు ముందుకు రాకపోతున్నారంటే ఇది వారి సంస్కారమన్నారు. కొమరం భీమ్, చాకలి ఐలమ్మ విగ్రహాల గురించి మాట్లాడుతున్న వారు వారు అధికారంలో లేదా అధికార పక్షాన ఉన్నప్పుడు ఎందుకు డిమాండ్ చేయలేదన్నారు. ఇప్పుడు మభ్య పెట్టేందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శాసన సభ సాక్షిగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరామన్నారు.
కెటిఆర్ కౌంటర్
బతికి ఉన్న వారికి సమాధి కట్టే వారి నుండి సంస్కారం నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు. బతికుండగానే ఎన్టీఆర్ పైన చెప్పులు వేయించిన దుర్మార్గులు, వీరు సంస్కారం గురించి మాట్లాడుతారా అన్నారు. ఎన్టీఆర్ పైన చెప్పులు వేయించినందుకు, తెలంగాణపై ఇచ్చిన మాటపై వెనక్కి పోయినందుకు చంద్రబాబుతో క్షమాపణలు చెప్పించి ఆ తర్వాత తన క్షమాపణ అడగాలన్నారు. దానికి టిడిపి స్పందిస్తూ.... ఎన్టీఆర్ పైన చెప్పులు వేయించారని కెటిఆర్ అనడం విడ్డూరమని, అప్పుడు కెసిఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications