వైకుంఠ ద్వార దర్శనాల వేళ.. టోకెన్ లేని భక్తులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మంగళవారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. భక్తుల గోవిందనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. శ్రీవారి దర్శనానంతరం భక్తులు వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 12.05 నిమిషాలకు వైకుంఠ ద్వారాలు తెరిచారు. అనంతరం అర్చకులు స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభించారు.
టోకెన్ లేని భక్తులు జనవరి 2 నుండి 8వ తేది వరకు సర్వదర్శనం క్యూలైన్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చు. దాదాపు 3500 మంది పోలీసు, విజిలెన్స్ సిబ్బందితో పగడ్భందీ ప్రణాళికలతో భద్రత ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. తొలిమూడు రోజుల పాటు టోకెన్ కలిగిన భక్తులు నిర్దేశిత టైమ్ స్లాట్ ప్రకారం దర్శన క్యూలైన్లకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని టీటీడీ ఈఓ సూచించారు.

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 9 నుండి 10:30 గంటల మధ్య శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. ఇందులో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు.
వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ తెల్లవారు జామున 4:30 నుండి 5:30 గంటల మధ్య శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నానమాచరించిన వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందన్నది ప్రాశస్త్యం. వైకుంఠ ద్వాదశి నాడు కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది.
ఈ సందర్భంగా తిరుమలలోని శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, నరేష్, శాంతారాం, జానకి దేవి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి చేసుకుని వెలుపలకు వచ్చిన భక్తులతో మాట్లాడి టీటీడీ కల్పించిన సౌకర్యాలు, సదుపాయాలపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్ల పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారని బీఆర్ నాయుడు తెలిపారు.
-
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications