TTD:భక్తులతో పోటెత్తిన తిరుమల.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్; దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే!!
కలియుగ ప్రత్యక్ష దైవం.. కోరి కొలిచిన వారి కొంగుబంగారంగా భక్తుల కోరికలను తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధి తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తిరుమలలో స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లన్ని నిండి వెలుపల క్యూ లైన్ లలో కూడా వేచి చూస్తున్న పరిస్థితి ఉంది.
తిరుమలలో స్వామి దర్శనానికిఇన్ని గంటల సమయం
ఇక తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా, సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతున్నట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇదిలా ఉంటే బుధవారం రోజు 81,930 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 41,224 మంది తలనీలాలు సమర్పించారని, హుండీలో 3.90 కోట్ల కానుకలు వేసారని పేర్కొన్నారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
మొన్న సర్వదర్శనం కోసం భక్తులకు 18 గంటల సమయం పట్టిందని వెల్లడించారు. ఇదిలా ఉంటే తాజాగా నిన్న 76,369 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, 41,927 మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ పేర్కొంది. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్లుగా పేర్కొంది. ప్రస్తుతం భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతుందని వెల్లడించింది.
300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 9-10 గంటల సమయం
ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి సుమారు 9 గంటల నుంచి పది గంటల సమయం పడుతుందని వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో వేసవి సెలవులు కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. అయితే వేసవి ఆరంభంలో విపరీతంగా ఎండలు ఉండడంతో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. కానీ ఇప్పుడు వర్షాలు కురుస్తున్న క్రమంలో వాతావరణం చల్లబడడంతో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.
భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ ఏర్పాట్లు
ఇక తిరుమలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలన్నీ తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. ఇక తిరుమలలో భక్తుల తాకిడి పెరిగిన దృష్ట్యా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. వారికి అల్పాహారం, పాలు, మంచినీటి వసతిని కల్పించారు. తిరుమలలో మున్ముందు భక్తుల తాకిడి మరింత పెరుగుతుందని టీటీడీ అంచనా.
-
85,000 శ్రీవారి లడ్డూలు సిద్ధం -
Vijayawada: విజయవాడలో నాన్ వెజ్ బంద్-ఇవాళ రాత్రి నుంచే..! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications