కిడ్పాప్ స్టోరీ మలుపు: మహిళా టెక్కీపై అత్యాచారం
మహిళా టెక్కీపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు నిందితులు సతీష్, వెంకటేశ్వర్లును మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. వోల్వో కారులో మహిళా టెక్కీని కిడ్నాప్ చేసి, మెదక్ జిల్లా కొల్లూరు వద్ద బిర్లా స్కూల్ సమీపంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని అన్నారు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ అపహరణకు గురైందని తెలిసిన వెంటనే తాము అప్రమత్తయ్యామని, అంతటా గాలించామని ఆనంద్ చెప్పారు. హైటెక్ సిటీ మాదాపూర్ ప్రాంతంలో ఈ నెల 18వ తేదీన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇంజనీర్పై క్యాబ్ డ్రైవర్, అతని మిత్రుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. కారు చిత్రాన్ని సిసిటివీ కెమెరాల ద్వారా గుర్తించి నిందితులను పట్టుకున్నామని ఆనంద్ చెప్పారు.
గుంటూరు జిల్లాకు చెందిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్పై హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ గౌలిదొడ్డిలోని హాస్టల్లో ఉంటోంది. ఈ నెల 18వ తేదీ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఇనార్బిట్ మాల్లో షాపింగ్ చేసుకుని, హాస్టల్కు వెళ్లేందుకు నిలబడింది.
ఆ సమయంలో లిఫ్ట్ ఇస్తానంటూ ఓ క్యాబ్ రావడంతో అందులో ఎక్కింది. క్యాబ్ డ్రైవర్ ఆ యువతిని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించి, తప్పించుకుని వచ్చింది.
కేసులో ఆధారాలు చాలా ఉన్నాయని సివి ఆనంద్ చెప్పారు. దర్యాప్తు సందర్భంలో చాలా లోపాలు తెలిశాయని, టోల్ గేట్ల నిర్వాహకులు వాహనం నెంబర్లు నోట్ చేస్తే బాగుంటుందని ఆనంద్ అన్నారు. సిసిటీవి ఫుటేజ్లో రికార్డు అయిన కారు దృశ్యాల ఆధారంగా కేసును ఛేదించినట్లు ఆయన తెలిపారు.