పవన్ కల్యాణ్ పర్యటన కోసంఫ్లెక్సీలు కడుతూ...కరెంట్ షాక్తో ఇద్దరు మృతి
విశాఖపట్టణం:జనసేన అధినేత పవన్కల్యాణ్ పర్యటన విశాఖ పర్యటన నేపథ్యంలో విషాదం చోటుచేసుకుంది. పవన్ రాక సందర్భంగా ఇద్దరు యువకులు ఫ్లెక్సీలు కడుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగెలు తగలటంతో కరెంట్ షాక్ కు గురై మృతిచెందారు. దీంతో మృతుల కుటుంబాల్లో పెను విషాదం చోటుచేసుకుంది.
జనసేన అధినేత పవన్కల్యాణ్ విజయనగరం జిల్లా పర్యటన ముగించుకొని ప్రస్తుతం విశాఖ జిల్లాలో అరకు నుంచి పర్యటన ఆరంభించిన సంగతి తెలిసిందే. బుధవారం పవన్ జిల్లాలోని పాయకరావుపేటలో పర్యటించనున్నారు. దీంతో తమ అభిమాన హీరో రాకను పురష్కరించుకుని తునికి చెందిన తోళెం నాగరాజు, పాయకరావుపేటకే చెందిన శివ అనే ఇద్దరు యువకులు సాయిమహల్ జంక్షన్ దగ్గర భారీ స్వాగత ఫ్లెక్సీలు కట్టేపనిలో ఉన్నారు.

ఈ క్రమంలో వాటిని రహదారి పక్కనే కడుతుండగా ఆ ఫ్లెక్సీలు పక్కనే ఉన్న విద్యుత్ తీగెలు తగలడంతో విద్యుత్ షాక్ గురై మృతిచెందారు. చేతికి ఎదిగొచ్చిన కొడుకులు తమ అభిమాన హీరోపై అభిమానాన్ని చాటుకునేందుకు బ్యానర్లు కట్టేక్రమంలో కరెంట్ షాక్ తో మృతిచెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. దీంతో పాయకరావుపేటలో విషాదఛాయలు నెలకొన్నాయి.
-
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!!












Click it and Unblock the Notifications