శివాజీ! ఇది సినిమా కాదు, కళ్యాణ్ జీ చెప్పారని..: టీడీపీ, వైసీపీలపై తేల్చేసిన ఉండవల్లి

Recommended Video

    డబ్బు ఒకటి ఉంటే సరిపోదు...శివాజీ కి పంచ్

    అమరావతి: ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ద్రవిడ లాంటి వాటితో దక్షిణాదిపై ఓ జాతీయ పార్టీ కన్నేసిందని సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. ఇలాంటివి సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతాయని అన్నారు.

    కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

    రాజకీయ పార్టీలు డబ్బు ఖర్చు చేసి పొలిటికల్ ఆపరేషన్ చేస్తాయని అనుకోవడం అవివేకమే అవుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల్లో గెలవాలనే ఉంటుందని, అయితే సినిమాల్లో చూపించినట్లుగా రాజకీయ వ్యూహాలు ఉండవని అన్నారు.

    సినీ వ్యూహాలు పనిచేయవు

    సినీ వ్యూహాలు పనిచేయవు

    ఆపరేషన్ గరుడకు రూ. 4800 కోట్లు కేటాయించారన్న శివాజీ వ్యాఖ్యలపై ఉండవల్లి స్పందిస్తూ.. ప్రజల ఓటింగ్‌ను బట్టే పార్టీలు గెలుస్తాయని, పార్టీల వ్యూహాలతో కాదని స్పష్టం చేశారు. పార్టీల వ్యూహాలు కేవలం ఓటింగ్‌ను ఆకర్షించడానికి మాత్రమే పనిచేస్తాయని తెలిపారు.

     టాటా, అంబానీలు అయిపోరా?

    టాటా, అంబానీలు అయిపోరా?

    డబ్బుతోనే గెలుస్తామనుకుంటే.. టాటాలు, అంబానీలు వద్ద మన బడ్జెట్ అంత డబ్బుందని.. నిమిషాల్లో వారు గవర్నమెంటును మార్చేయగలరని చెప్పారు. అయితే, శివాజీ కథ చెప్పారని తాను అనడం లేదని, ఆయన కథే చెప్పాలనుకుంటే నిన్నే చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.

    కళ్యాణ్ జీ చెబితే..

    కళ్యాణ్ జీ చెబితే..

    ఎవరో కళ్యాణ్ జీ అనే వ్యక్తి చెబితే.. శివాజీ నమ్మి ఉంటారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో లోకసభలో వెల్‌లో కనీసం 100మంది సభ్యులు ఆందోళన చేస్తున్నారని, ఆ ఆందోళనల్లో రాష్ట్రాన్ని విభజించారని ఉండవల్లి అన్నారు.

    టీడీపీ, వైసీపీలు కలిసిపోవాలి..

    టీడీపీ, వైసీపీలు కలిసిపోవాలి..

    సభలో ఉన్న సభ్యులను లెక్కించడానికి అప్పుడు వీలైనప్పుడు.. ఇప్పుడెందుకు కాదని లోకసభ స్పీకర్‌ను ఉండవల్లి ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీలు ఆధిపత్య పోరును ఆపేయాలని, కనీసం మంగళవారమైనా కలిసి అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వాలని కోరారు. పోట్లాడుకోవడాన్ని కనీసం ఒక్కరోజైనా వాయిదా వేయాలన్నారు.

    తప్పని ఒప్పుకోవాలి..

    తప్పని ఒప్పుకోవాలి..

    టీడీపీ, వైసీపీ పార్టీలకు చెందిన 23మంది ఎంపీలు కలిసి స్పీకర్ వద్దకు వెళ్లి లెక్కించమని అడగాలని, లేకపోతే 2014లో లోకసభలో జరిగింది తప్పని ప్రకటించమని డిమాండ్ చేయాలని సూచించారు. ఆ రోజు కరెక్టయిందని.. ఈ రోజు తప్పెలా అవుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+