ఏపీతో నాకు బంధుత్వం: టీడీపీకి కేంద్రమంత్రి విజ్ఞప్తి, మోడీ చరిత్రలో నిలుస్తారని శివప్రసాద్
ఢిల్లీ: ఏపీతో తనకు దగ్గరి బంధుత్వం ఉందని కేంద్రమంత్రి అనంత్ కుమార్ గురువారం అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు వెంటనే నెరవేర్చాలంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోకసభలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అనంత్ కుమార్ మాట్లాడారు. ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.

కేంద్రమంత్రి వినతికి టీడీపీ నో
దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ స్పందించారు. ఎంపీలు ఆందోళన విరమించి ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని కోరారు. కూర్చొని నిరసన తెలపవచ్చునని అన్నారు. ఆయన విజ్ఞప్తిని తిరస్కరించిన తెలుగుదేశం పార్టీఎంపీలు ప్రత్యేక హోదా పైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగుతుందని తెలిపారు.

ఏపీతో నాకు బంధుత్వం ఉంది
దీనికి అనంత్ కుమార్ స్పందిస్తూ.. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి తనకు తెలుసునని చెప్పారు. ఆ రాష్ట్రంతో తనకు దగ్గర బంధుత్వం ఉందని చెప్పారు. కర్ణాటకకు చెందిన అనంత్ కుమార్ ప్రస్తుతం బెంగళూరు దక్షిణ నియోజకవర్గ ఎంపీగా ఉన్నారు.

ఆర్ధర్ కాటన్ వేషధారణలో చిత్తూరు ఎంపీ
అంతకుముందు, ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని కోరుతూ టీడీపీ ఎంపీలు పార్లమెంటు బయట ఆందోళన చేశారు. పార్లమెంటు ఆవరణలో ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సర్ ఆర్థర్ కాటన్ వేషధారణలో ఆందోళనలో పాల్గొన్నారు.

మోడీ చరిత్రలో నిలిచిపోతారు
బ్రిటీష్ ఇంజినీరైన కాటన్ ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం అయ్యేలా చేస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకెంత చేయాలని శివప్రసాద్ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తే మోడీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. పార్లమెంటుకు ఎంతోమంది వచ్చారు, వెళ్లారు.. మీరు కూడా పోతారని కానీ మనిషిగా వెళ్లండన్నారు. మొండి వైఖరితో ముందుకెళ్తే ప్రజలు చూసుకుంటారన్నారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications