గోశాలకు దూడలను విరాళమిచ్చిన వెంకయ్య తనయుడు (ఫోటోలు)
తిరుమల: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కుమారుడు హర్షవర్ధన్ బుధవారం సాయంత్రం టీటీడీకి చెందిన గోసంరక్షణ ట్రస్ట్కు ఆరు దేశీయ ఆవులను దానంగా ఇచ్చారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ చదవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన ఎస్వీ గోశాలకు వీటిని విరాళంగా అందించారు.
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీటీడీ ఈవో డి సాంబశివరావు, బోర్డు మెంబర్ జి భానుప్రకాశ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ అధికపాలదిగుబడి ఇచ్చే హర్యానాలోని సాహివాల్ జాతికి చెందిన దేశవాళీ గోవులను వర్షవర్ధన్ తితిదేకి విరాళం అందించడం సంతోషకరమన్నారు.

గోశాలకు దూడలను విరాళమిచ్చిన వెంకయ్య తనయుడు
హిందూ పురాణాల్లో గోవుకు ప్రత్యేక స్థానం ఉందని, దీన్ని గుర్తించి వాటి సంరక్షణకు టీటీడీ కృషి చేస్తోందన్నారు. గోపూజతో పాటు గోకులాష్టమి రోజున పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ గోసంరక్షణకు పాటుపడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

గోశాలకు దూడలను విరాళమిచ్చిన వెంకయ్య తనయుడు
టీటీడీ ఈవో డా డి. సాంబశివరావు మాట్లాడుతూ శ్రీవారికి గోవు అత్యంత ప్రీతికరమైందన్నారు. దేశీయ గోవులు అంతరించిపోతున్న తరుణంలో ఎస్వీ గోసంరక్షణ ట్రస్టు ద్వారా వాటిని సంరక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతంలో తిరుపతిలోని గోశాలలో అత్యాధునిక వసతులతో నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు.

గోశాలకు దూడలను విరాళమిచ్చిన వెంకయ్య తనయుడు
దేశీయ గోవుల పాలు, గోమూత్రంలో ఔషధ గుణాలున్నాయని, వాటిపై పరిశోధన చేసి ప్రాచుర్యం కల్పిస్తామని చెప్పారు. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భానుప్రకాష్రెడ్డి మాట్లాడుతూ హిందూ సంస్కృతిలో తల్లి తర్వాత స్థానం గోమాతదే అన్నారు. దేశీయ గోవుల పాలతోనే శ్రీవారికి అభిషేకం, ఇతర కైంకర్యాలు జరుగుతున్నాయని చెప్పారు.

గోశాలకు దూడలను విరాళమిచ్చిన వెంకయ్య తనయుడు
గోవధను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. అంతకుముందు తిరుపతికి చెందిన పి. నాగేశ్వర్ కుమారుడు హేమవెంకటనారాయణ భగవద్గీత శ్లోకాలను వినిపించారు. టీటీడీ ఛైర్మన్, ఈవో ఆ బాలుడిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ గోశాల సంచాలకులు హరినాథరెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్లు శ్రీనివాసులు, నాగరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications