గో బ్యాక్: షాకిచ్చిన సమైక్యవాదులు, చిరు నినాదాలు
చిరంజీవి గో బ్యాక్, సమైక్యాంధ్ర కోసం చిరంజీవి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సమైక్యవాదులు నినాదాలు చేశారు. తాము అభివృద్ధికి అడ్డు కాదని కానీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయిస్తామని చెప్పి కేంద్రమంత్రులు మభ్య పెట్టారన్నారు.
చిరంజీవి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. పోలీసులు వారిని అడ్డుకొని చెదరగొట్టారు. దీంతో చిరు కాన్వాయ్ ముందుకు పోయింది.
ఆ తర్వాత కడియపులంకలో చిరంజీవి సమైక్యవాణి వినిపించారు. ఎకో టూరిజం పార్కు నిర్మాణానికి ఆయన శంఖుస్థాపన చేశారు. అనంతరం సభా వేదిక పై నుండి సమైక్య నినాదాలు చేశారు.
కాగా, ఇటీవల చిరంజీవికి తెలంగాణ సెగ తగిలిన విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లా వేములవాడలో చిరంజీవిని పలువురు తెలంగాణవాదులు, తెలంగాణ విద్యార్థి పరిషత్ విద్యార్థులు అడ్డుకున్నారు. జై తెలంగాణ, చిరంజీవి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని తప్పించారు.