వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గో బ్యాక్: షాకిచ్చిన సమైక్యవాదులు, చిరు నినాదాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Chiranjeevi
రాజమండ్రి: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి ఆదివారం సమైక్య సెగ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా కంబాల చెరువు వద్ద ఆయన కాన్వాయ్‌ని సమైక్యవాదులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాయమాటలతో చిరంజీవి సీమాంధ్ర ప్రజలను మభ్య పెట్టారని ఆరోపించారు.

చిరంజీవి గో బ్యాక్, సమైక్యాంధ్ర కోసం చిరంజీవి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సమైక్యవాదులు నినాదాలు చేశారు. తాము అభివృద్ధికి అడ్డు కాదని కానీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయిస్తామని చెప్పి కేంద్రమంత్రులు మభ్య పెట్టారన్నారు.

చిరంజీవి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. పోలీసులు వారిని అడ్డుకొని చెదరగొట్టారు. దీంతో చిరు కాన్వాయ్ ముందుకు పోయింది.

ఆ తర్వాత కడియపులంకలో చిరంజీవి సమైక్యవాణి వినిపించారు. ఎకో టూరిజం పార్కు నిర్మాణానికి ఆయన శంఖుస్థాపన చేశారు. అనంతరం సభా వేదిక పై నుండి సమైక్య నినాదాలు చేశారు.

కాగా, ఇటీవల చిరంజీవికి తెలంగాణ సెగ తగిలిన విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లా వేములవాడలో చిరంజీవిని పలువురు తెలంగాణవాదులు, తెలంగాణ విద్యార్థి పరిషత్ విద్యార్థులు అడ్డుకున్నారు. జై తెలంగాణ, చిరంజీవి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని తప్పించారు.

English summary
United Andhra Pradesh supporters obstructed Union Tourism Minister Chiranjeevi in East Godavari district on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X