పశ్చిమ గోదావరి జిల్లాలో అశ్లీల నృత్యాలు .. హాజరైన వైసీపీ నాయకులు ?
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన రికార్డింగ్ డ్యాన్సులు అశ్లీల నృత్యాలుగా మారాయి . స్థానికంగా కలకలం రేపాయి. పోడూరు మండలం కవిటం గ్రామానికి చెందిన ఓ వ్యాపారవేత్త నిన్నరాత్రి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలను పెనుమంట్ర మండలంలోని మార్టేరులో ఉన్న కోణాల మాణిక్యం కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఇక వేడుకలకు రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలు హాజరయినట్లు సమాచారం.
అయితే ఈ రికార్డింగ్ డ్యాన్సులకు హాజరైన నేతలు ఎవరు .సదరు నేతలపై పోలీసులు కేసు నమోదుచేశారా? లేదా? అన్నది ఇంకా తెలియరాలేదు. కార్యక్రమంలో ఐదుగురు యువతులను తీసుకొచ్చి రికార్డింగ్ డ్యాన్సులు చేయించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్న ఐదుగురు యువతులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు.
డ్యూటీలు ఎగ్గొట్టే డాక్టర్లారా జాగ్రత్త.. మీకూ వస్తోంది బయో మెట్రిక్..! గీత దాటితే వేటే..!