బాబును కలిశాక మళ్లీ వేణుమాధవ్, లోకేష్ సైకిల్ టూర్
కృష్ణా జిల్లాలోని నందివాడలో వేణు మాధవ్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువసేన గుడివాడ నుండి ద్విచక్ర వాహనాల ర్యాలీతో వేణుకు ఘన స్వాగతం పలికారు. శిబిరంలో వందలాది మంది రోగులకు వైద్య పరీక్షళు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
లోకేష్ సైకిల్ యాత్ర
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ చేపట్టనున్న సైకిల్ యాత్ర ఈ నెల 16వ తేదిన ప్రారంభం కానుంది. కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాదు, నల్గొండ, ఖమ్మం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ యాత్ర సాగుతుంది కుప్పంలో ముగుస్తుంది.
దీనిని ఎన్ని రోజులు చేపట్టాలనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, ప్రజల భవిష్యత్తు, విద్య, ఉపాధి అవకాశాలు వంటి విషయాల పైనే ప్రధానంగా లోకేష్ ప్రజల్లోకి వెళ్లనున్నారు.