చిరుని టార్గెట్ చేసిన విజయమ్మ, టిలో షర్మిల(పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సీమాంధ్ర ప్రాంతంలో, షర్మిల తెలంగాణలో జోరుగా పర్యటిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో మాట్లాడిన వైయస్ విజయమ్మ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు.
తనను గెలిపించిన ప్రజలనే చిరంజీవి మోసం చేస్తున్నారని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009 ఎన్నికల్లో దాదాపు 70 లక్షల మంది చిరును చూసి ఓటేశారని, పద్దెనిమిది అసెంబ్లీ స్థానాల్లో గెలిపించారని, అయినా ఆయన కేంద్రమంత్రి పదవి కోసం ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు
ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలిసి రాష్ట్రాన్ని ముక్కలు చేశాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు
నిజాయితీలేని రాజకీయాలు చూడాల్సి వస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవస్థ దిగజారిపోయిందని, రాజకీయమంటే పేదల మనసు తెలుసుకోవడమని తన తండ్రి తనకు నేర్పారన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సీమాంధ్ర ప్రాంతంలో, షర్మిల తెలంగాణలో జోరుగా పర్యటిస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు
కాంగ్రెసు పార్టీతో చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తాను జైలులో ఉండి కూడా విభజనను అడ్డుకోవాలని చూశానన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు
తూర్పు గోదావరి జిల్లాలో మాట్లాడిన వైయస్ విజయమ్మ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు.

వైయస్సార్ కాంగ్రెసు
తనను గెలిపించిన ప్రజలనే చిరంజీవి మోసం చేస్తున్నారని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009 ఎన్నికల్లో దాదాపు 70 లక్షల మంది చిరును చూసి ఓటేశారని, పద్దెనిమిది అసెంబ్లీ స్థానాల్లో గెలిపించారని, అయినా ఆయన కేంద్రమంత్రి పదవి కోసం ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు
కాంగ్రెసు పార్టీ విభజనపై నిర్ణయం తీసుకున్న తర్వాత తామంతా రాజీనామా చేస్తామని, అదే దారిలో నడవాలని కిరణ్ కుమార్ రెడ్డికి సూచిస్తే పెడ చెవిన పెట్టారన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు
1950లో మూడో స్థానంలో ఉన్న హైదరాబాదును చంద్రబాబు నాయుడు ఐదో స్థానానికి తెచ్చారని విజయమ్మ మండిపడ్డారు. ఆమె ప్రచారంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు ఉన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ ప్రాంతంలో జోరుగా పర్యటిస్తున్నారు. ఆమె మంగళవారం కుత్బుల్లాపూర్ తదితర నియోజకవర్గాల్లో పర్యటించారు.

వైయస్సార్ కాంగ్రెస్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఓట్లు అడిగే హక్కు లేదని షర్మిల అన్నారు. నిస్సిగ్గుగా చంద్రబాబు వాగ్ధానాలు చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications