ముమ్మాటికీ తప్పే: జగన్ పార్టీకి విష్ణుకుమార్ రాజు మద్దతు
రవాణా శాఖ అధికారి బాల సుబ్రహ్మణ్యం పట్ల తెలుగుదేశం ఎంపీ, ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ సోమవారం శాసనభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టారు. వారి ఆందోళనకు భారతీయ జనతా
అమరావతి: రవాణా శాఖ అధికారి బాల సుబ్రహ్మణ్యం పట్ల తెలుగుదేశం ఎంపీ, ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ సోమవారం శాసనభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టారు. వారి ఆందోళనకు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మద్దతు పలికారు.
ప్రభుత్వ అధికారుల పట్ల తెలుగుదేశం నేతలు ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు. ఈ కేసులో ఎవరున్నా శిక్షించాల్సిందేనని అన్నారు. అధికారులపై దాడులు చేయడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళుతుందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల ఆందోళన సమంజసమేనని ఆయన అన్నారు. బీజేపీ న్యాయం ఎవరివైపు ఉంటే.. అటువైపు ఉంటుందని అన్నారు.
రాజధాని ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని విష్ణుకుమార్రాజు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలో రవాణాశాఖ కమిషనర్ పట్ల టీడీపీ నేతలు వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు.

అధికారులపై దౌర్జన్యపూరితంగా వ్యవహరించకూడదని సూచించారు. ఇలాంటి ప్రవర్తనతో రాజధాని ప్రతిష్ఠ దెబ్బతింటుందన్నారు. ముఖ్యమంత్రి వాళ్లని పిలిచి మందలించడం మంచి పరిణామమని.. వారు కూడా కమిషనర్ క్షమాపణ చెప్పి తమ గౌరవాన్ని కొంత కాపాడుకున్నారని వ్యాఖ్యానించారు.
విశాఖ ల్యాండ్ పూలింగ్ పై చర్చ
విశాఖలో ల్యాండ్ పూలింగ్ పేరుతో వెయ్యి ఎకరాల భూములను ప్రైవేటు వ్యక్తులు లాక్కున్నారని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. పేదల భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా ల్యాండ్ పూలింగ్ ఇస్తారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications