జగన్ ఒక్కరే సైనికుడిలా పోరాటం: పార్టీలోకి విశ్వరూప్
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే సైనికుడిలా పోరాటం చేస్తున్నారని మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ శుక్రవారం అన్నారు. ఆయన వైయస్ జగన్ సమక్షంలో లోటస్ పాండులో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
తూర్పు గోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుస్తుందని తెలిపారు. రాష్ట్ర సమైక్యత కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రమే స్పష్టమైన పోరాటం చేస్తోందన్నారు. సమైక్యాంధ్రకు జగన్ మొక్కవోని ధైర్యంతో పోరాటం చేస్తున్నారన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతృత్వంలో తాను సమైక్యాంధ్ర కోసం సుశిక్షిుతడైన సైనికుడిలా పోరాటం చేస్తానన్నారు. విశ్వరూప్కు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విశ్వరూప్తో పాటు పలువురు ఆ పార్టీలో చేరారు.
మళ్లీ రాజీనామా చేస్తా: సాయి ప్రతాప్
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ స్పీకర్ ఫార్మాట్లో చేసిన తన రాజీనామాను స్పీకర్ మీరా కుమార్ తిరస్కరించడం బాధాకరమని ఎంపి సాయి ప్రతాప్ న్యూఢిల్లీలో అన్నారు. తాను మరోసారి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాను సమర్పిస్తానని చెప్పారు. రాజీనామాను ఆమోదించకుంటే పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామన్నారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications