దేవుడు పోలీసైనా న్యాయం చేయలేడు: పోలీస్అధికారి
కర్నూలు: ప్రస్తుతం ఉన్న పోలీసు వ్యవస్థలో నిజాయితీ, నిష్పక్షపాతంగా పని చేయడం కష్ట సాధ్యమని, ఇప్పటి పరిస్థితుల్లో భగవంతుడు పోలీసు అయినా ప్రజలకు పూర్తి న్యాయం చేయలేడని ఆంధ్రప్రదేశ్ అదనపు డీజీపీ, జైళ్ల శాఖ విభాగాధిపతి వీకే సింగ్ ఆదివారం అన్నారు.
'ఇదా మన పోలీసు వ్యవస్థ' అనే పుస్తకాన్ని ఆయన రచించారు. ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను బీహార్వాసిని అని, సామాజిక సేవకుడు, అధ్యాపకుడు అయిన తన తండ్రి పైన పోలీసులు అక్రమ కేసు బనాయించి అన్యాయం చేశారన్నారు.

ఆ కసితోనే పోలీసు శాఖలో మార్పు తీసుకు వచ్చేందుకు, బాధితులకు న్యాయం చేసేందుకు పట్టుదలతో చదివి ఐపీఎస్ సాధించానని చెప్పారు. ప్రస్తుత పోలీసు వ్యవస్థ ప్రజలకు న్యాయం చేయలేదన్నారు.
రాజకీయ నేతలు, డబ్బు, పరపతి ఉన్న వాళ్లకే పోలీసు వ్యవస్థ ఉపయోగపడుతోందనే సంగతిని గుర్తించానని వ్యాఖ్యానించారు. జైళ్లలో ఉంటున్న తొంబై శాతం మంది పేదలేనని, డబ్బున్న నేరస్తులు బయట తిరుగుతున్నారన్నారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications