పవన్ కళ్యాణ్ పూజల వివాదం:ఆయన చెప్పడం వల్లే ఆ సమయంలో పూజలు...అర్చకుడి వివరణ
ఏలూరు:పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాథపురంలో లక్ష్మీనరసింహస్వామికి పవన్ కళ్యాణ్ సోమవారం తెల్లవారుజామున చేసిన పూజలు వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.
ఈ వివాదం చివరకు ఈ పూజలు నిర్వహించిన అర్చకుడికి మెడకు చుట్టుకుంది. నిబంధనల ప్రకారం ఈ దేవాలయంలో తెల్లవారుజామున ఐదు గంటల తరువాతే పూజలు ప్రారంభించాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ అంతకంటే ముందే ఇక్కడ పూజలు నిర్వహించడం రగడకు దారితీసింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా దేవస్థానం అధికారులు పూజారిని ఆదేశించారు. దీంతో పవన్ చెప్పడం వల్లే తాను ఆ సమయంలో పూజలు చేయాల్సివచ్చిందని ఆ పూజారి వివరణ ఇచ్చారట.
పశ్చిమగోదావరి జిల్లాలోని ఐ.ఎస్.జగన్నాథపురంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ సోమవారం సుమారు నాలుగు గంటల సమయంలో పూజలు చేయించినట్లు బైటపడటం కలకలం రేపింది. ప్రజాపోరాటయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ జంగారెడ్డిగూడెం నుంచి వేకువఝామున బయలుదేరి సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఆలయం వద్దకు వచ్చారట.

అర్చకుడికి కబురు చేసి స్వామివారికి పూజలు చేయాలని కోరారట. తాను ఆలయానికి వస్తున్నట్లు ముందుగానే అందరికీ తెలిస్తే జనాల తాకిడితో భక్తులకు ఇబ్బందులు తలెత్తుతాయని...అందువల్ల పూజలు నిర్వహిస్తే వెళ్లిపోతానని పవన్ చెప్పారట. దీంతో అర్చకులు పూజా కార్యక్రమాలు చేపట్టారని చెబుతున్నారు. అయితే దీనిపై దుమారం రేగడంతో దేవస్థానం అధికారులు ప్రధాన అర్చకుడిని వివరణ అడిగారు.
అయితే భద్రతా కారణాలు, అభిమానుల తాకిడి వంటి వాటి గురించి పవన్ కళ్యాణ్ చెప్పడంతోనే ముందుగా పూజలకు ఉపక్రమించామని ప్రధాన అర్చకుడు సూర్యప్రకాశ్ అధికారులకు వివరణ ఇచ్చుకున్నారు. కాగా గతంలో ఇదే ఆలయంలో పవన్ తాంత్రిక పూజలు చేసినట్టు సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలావుంటూ నిన్న పశ్చిమగోదావరి జిల్లా ఐ.ఎస్.జగన్నాథపురంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం గుర్వాయిగూడెంలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయాన్నే ఆలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్కు ఆలయమర్యాదలతో అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు పవన్కళ్యాణ్కు ఆశీర్వచనాలు అందచేశారు.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications