బిల్లు తరిమికొడ్తాం: దేవినేని, జగన్ సభపై ఓయు విజ్ఞప్తి

తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ప్రజల హక్కులను కాపాడుతుందన్నారు. ఇరు ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. గోదావరి, కృష్ణా డెల్టాలకు నీరు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి తొత్తులుగా మారారని విమర్శించారు.
సీమాంధ్ర ప్రాంతానికి నికర జలాల కోసం తాము రాజీలేని పోరాటం చేస్తామన్నారు. కృష్ణా డెల్టా రైతులు నికర జలాలు లేక ఇబ్బంది పడుతున్నారని, గోదావరి డెల్టా కింద పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైయస్ జగన్ తన బెయిల్ కోసం కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఇప్పుడు సమైక్యాంధ్ర అంటూ సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
జగన్ సభపై ఓయు ఐకాస
ఉస్మానియా ఐక్యకార్యాచరణ సమితి నాయకులు శనివారం మధ్యాహ్నం డిజిపి ప్రసాద రావును కలిశారు. ఈ నెల 26న హైదరాబాదులో జరగనున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభకు అనుమతిని రద్దు చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications