తీవ్ర నిరాశే, నేర్చుకుంటాం: ఫలితాలపై చిరంజీవి
హైదరాబాద్: ప్రజలు ఇచ్చిన తీర్పు తీవ్ర నిరాశే కలిగించిన మాట నిజమేనని కాంగ్రెసు సీమాంధ్ర ప్రచార సారథి, కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. పార్టీకి వివిధ వర్గాల ప్రజలు ఎందుకు దూరమయ్యారో నిజాయితీగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
అధికారంలో ఉన్న గత పదేళ్లలో జరిగిన లోపాలు, తప్పుల నుంచి విలువైన గుణపాఠం నేర్చుకుని పార్టీని క్షేత్ర స్థాయి నుంచి పునర్నిర్మించడానికి అవసరమైన చర్యలను పార్టీ జాతీయ నాయకత్వం తీసుకుంటుందనే విశ్వాసం ఉందని ఆయన అన్నారు.

ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని ఆయన చెప్పారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
చిరంజీవికి సీమాంధ్ర ప్రచార సారథ్య బాధ్యతలను కాంగ్రెసు అధిష్టానం అప్పగించింది. పార్టీని నిలబెట్టడానికి, పార్టీ వైపు ప్రజలను ఆకర్షించడానికి ఆయన తీవ్రంగానే ప్రయత్నించారు. బస్సు యాత్ర కూడా నిర్వహించారు. అయినా, ప్రజలు కాంగ్రెసును తిరస్కరించారు.
-
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్ను చిత్తు చేసిన సన్రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!!












Click it and Unblock the Notifications