Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం జగన్‌ ప్రజాదరణ ఏ స్థాయిలో ఉంది : విపక్ష పార్టీల ఓట్ షేర్ ఏంత : పబ్లిక్ పల్స్ లెక్కలు-వాస్తవాలు..!!

ఏపీలో ముఖ్యమంత్రి జగన్ కు ప్రజాదరణ పెరిగిందా - తగ్గిందా. రెండున్నారేళ్ల కాలం పాలన పూర్తి చేసుకుంటున్న జగన్ పాలన పైన ప్రజలు ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారు. విపక్షాల పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు వీటన్నింటికీ తాజాగా వరుసగా జరిగిన ఎన్నికలే సమాధానం చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా అధికారం దక్కించుకున్న జగన్ ఏకంగా 151 అసెంబ్లీ..22 లోక్ సభ సీట్లు సాధించారు. ఆ తరువాత రెండేళ్ల పాలన వేళ రాష్ట్రంలో స్థానిక సంస్థలు..పంచాయితీ ఎన్నికలు జరిగాయి. ఇవి ఒక రకంగా రెండేళ్ల పాలన మీద ప్రజాభిప్రాయంగా వైసీపీ పరిగణిస్తోంది.

తమకు పాటిటివ్ ఓటింట్ అంటున్న వైసీపీ

తమకు పాటిటివ్ ఓటింట్ అంటున్న వైసీపీ

సంక్షేమ పధకాలే తమకు ఇంత పెద్ద మొత్తంలో విజయం అందించాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల కంటే తాజాగా జరిగి జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి అధికంగా 17.66 శాతం ఓట్లు దక్కాయి. మొత్తం పోలైన ఓట్లలో 67.61 శాతం ఓట్లు అధికార పార్టీకే వచ్చాయి. అయితే, టీడీపీకి భారీగా ఓటింగ్ షేర్ తగ్గిపోయింది. టీడీపీకి 22.79 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా, విపక్షం ఓట్లతో 16.38 శాతం మేర తగ్గుదల కనిపించింది. తాజాగా జరిగిన జెడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తం 1.30 కోట్ల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు.

జగన్ కు 2019 కంటే పెరిగిన ప్రజాదరణ

జగన్ కు 2019 కంటే పెరిగిన ప్రజాదరణ

ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన రెండేళ్లకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన పరిషత్‌ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్లతో కలిపి గ్రామీణ ప్రాంతానికి చెందిన 1,30,53,282 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని మెజారిటీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో 67.61 శాతం ఓట్లను అధికార వైఎస్సార్‌సీపీ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్ధులు దక్కించుకున్నారు. టీడీపీ గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్ధులకు 22.79 శాతం ఓట్లు దక్కాయి. ఓటర్లలో ఎస్సార్‌సీపీ గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్ధులకు 88,25,343 మంది ఓట్లు వేశారు.

టీడీపీకి ఓటింగ్ శాతం తగ్గటం వెనుక

టీడీపీకి ఓటింగ్ శాతం తగ్గటం వెనుక

టీడీపీ అభ్యర్ధులకు 29,75,238 మంది ఓటు వేశారు. ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలకు మిగిలిన ఓట్లు దక్కాయి. రెండేళ్ల పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య ఓట్ల తేడా 45 శాతం ఉండటం రాజకీయాల్లో అత్యంత అరుదైన అంశంగా పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో దాదాపు సగం మంది ప్రజలు జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేసినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇదంతా గ్రామీణ ఓటర్ల తీర్పుగా వాదన వినిపిస్తోంది.

ఇదే 2024 ఎన్నికల వరకు నిలుస్తుందా

ఇదే 2024 ఎన్నికల వరకు నిలుస్తుందా

అయితే, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే తరహా తీర్పు వచ్చింది. తాడిపత్రి మినహా అన్ని మున్సిపాల్టీలను వైసీపీ గెలుచుకుంది. కార్పోరేషన్లలో 14 కు 14 వైసీపీ గెలిచింది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలు సహజంగానే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయనే వాదన పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. వైసీపీ నేతలు మాత్రం దీంతో విభేదిస్తున్నారు. అధికార పార్టీకి కొంత మొగ్గు ఉండటం సాధారణమే అంటూనే..వరుసగా అన్ని ఎన్నికల్లోనూ అదే ఓటింగ్ శాతం ఏక మొత్తంటా ఒకే పార్టీకి రావటమనేది ఏపీలో వైసీపీకే దక్కిందని చెబుతున్నారు.

వైసీపీ ధీమా..పొలిటికల్ చర్చ

వైసీపీ ధీమా..పొలిటికల్ చర్చ

అయితే, స్థానిక ఎన్నికల్లో వచ్చిన తీర్పు తమకు ప్రజల్లో ఆదరణ చెక్కు చెదరలేదని వైసీపీ బలంగా నమ్ముతోంది. టీడీపీ మాత్రం ప్రజల్లో వైసీపీ ప్రభుత్వ పాలన పట్ల వ్యతిరేకత పెరిగిందని వాదిస్తోంది. దీంతో.. ఇదే ఆదరణ వైసీపీకి వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఉంటుందా-తగ్గుతుందా అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+