వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరు ఏ బిడ్డను వదులుకుంటారు?: ఆ ముగ్గురికి బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: విభజన అంశంపై తాను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖ పైన రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పించడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో స్పందించారు. 'ఏ బిడ్డను వదులుకుంటారు!?' అని కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలను ప్రశ్నించారు.

రాష్ట్ర విభజన సమస్యకు సంబంధించి సామరస్య పరిష్కారాన్ని చూపించాలని, ఆ తర్వాతే ముందుకు వెళ్లాలని ప్రధానికి బాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

"ప్రధానికి నేను రాసిన లేఖను ఎద్దేవా చేసే ముందు.. తమ బిడ్డల్లో ఏ బిడ్డను వదులుకుంటారో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు, తెరాస నేతలు ప్రకటించగలరా!?'' అని నిలదీశారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన సామరస్య పరిష్కారాన్ని కనుక్కోవాలని, ఆ తర్వాతే ముందుకు వెళ్లాలని ప్రధానిని తాను డిమాండ్ చేశానని చెప్పారు. కాగా, రాష్ట్రంలో మహిళలపై నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, దేశం మొత్తంమీద నేరాల్లో 11 శాతం రాష్ట్రంలోనే జరుగుతున్నాయని, నేరాల విషయంలో దేశంలో మన రాష్ట్రానిది రెండో స్థానమని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందోనని ధ్వజమెత్తారు.

English summary

 'Before commenting about my letter to PM, can the leaders of INC, YSRCP & TRS declare which child of theirs they are going to disown?' questioned Chandrababu Naidu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X