వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మీరు ఏ బిడ్డను వదులుకుంటారు?: ఆ ముగ్గురికి బాబు
రాష్ట్ర విభజన సమస్యకు సంబంధించి సామరస్య పరిష్కారాన్ని చూపించాలని, ఆ తర్వాతే ముందుకు వెళ్లాలని ప్రధానికి బాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
"ప్రధానికి నేను రాసిన లేఖను ఎద్దేవా చేసే ముందు.. తమ బిడ్డల్లో ఏ బిడ్డను వదులుకుంటారో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు, తెరాస నేతలు ప్రకటించగలరా!?'' అని నిలదీశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన సామరస్య పరిష్కారాన్ని కనుక్కోవాలని, ఆ తర్వాతే ముందుకు వెళ్లాలని ప్రధానిని తాను డిమాండ్ చేశానని చెప్పారు. కాగా, రాష్ట్రంలో మహిళలపై నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, దేశం మొత్తంమీద నేరాల్లో 11 శాతం రాష్ట్రంలోనే జరుగుతున్నాయని, నేరాల విషయంలో దేశంలో మన రాష్ట్రానిది రెండో స్థానమని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందోనని ధ్వజమెత్తారు.
Comments
chandrababu naidu telangana samaikyandhra k chandrasekhar rao ys jagan congress చంద్రబాబు నాయుడు తెలంగాణ సమైక్యాంధ్ర కె చంద్రశేఖర రావు వైయస్ జగన్ కాంగ్రెసు
English summary
'Before commenting about my letter to PM, can the leaders of INC, YSRCP & TRS declare which child of theirs they are going to disown?' questioned Chandrababu Naidu
Story first published: Thursday, November 7, 2013, 8:36 [IST]