వాసిరెడ్డి పద్మ దారెటు - ఆ పార్టీల్లోకి నో ఎంట్రీ..!?
వాసిరెడ్డి పద్మ. మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ గా పని చేసారు. వైసీపీ ఎన్నికల్లో ఓడిన తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసారు. టీడీపీలో చేరుతారని ప్రకటన చేసారు. దాదాపు ఏడాది కాలం అయినా ఇంకా ఆ పార్టీలో చేరలేదు. జనసేనలోనూ చేరుతారనే చర్చ జరిగింది. అయినా, వైసీపీని వీడిన తరువాత వాసిరెడ్డి పద్మ ఇంకా ఏ పార్టీలో చేరకపోవటం పైన రాజకీయంగా చర్చ సాగుతోంది. ఇదే సమయంలో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. మరి.. వాసిరెడ్డి పద్మ రాజకీయంగా ఏం చేయబోతున్నారు.. ఏ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
వాసిరెడ్డి పద్మ తొలుత ప్రజారాజ్యంలో పని చేసారు. ఆ పార్టీలో అధికార ప్రతినిధిగా వ్యవహరిం రు. ఆ తరువాత వైసీపీలో చేరారు. జగన్ హయాంలో కీలకమైన మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ పదవి దక్కించుకున్నారు. జగన్ పార్టీ ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి కూటమి పార్టీల్లో చేరుతారని ప్రచారం సాగింది. జగన్ హయాంలో కీలక పదవి దక్కినా ఆ పార్టీ పైన పద్మ కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు జగన్ అన్యాయం చేశారని విమర్శలు చేసారు. కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదని వాసిరెడ్డి పద్మ మద్దతు దారులు ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే, వాసిరెడ్డి పద్మకు మాజీ సీఎం జగన్ కేబినెట్ హోదా గౌరవించారని చెప్పుకొచ్చారు. ఇక.. వాసిరెడ్డి పద్మ టీడీపీలో చేరే అవకాశం ఉందని భావించారు. కాగా, పద్మ చేరికకు టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పారని తెలిసింది.

ఆ తరువాత జనసేనలో చేరేందుకు పద్మ ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. అయితే,అప్పటికే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరతారన్న ప్రచారంతో వాసిరెడ్డి పద్మ ఆ ఆలోచనను మానుకున్నారు. సామినేని జనసేనలో చేరడమే కాదు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. దీంతో.. జనసేన లో చేరాలనే ఆలోచన విరమించుకున్నారు. దీంతో.. టీడీపీ వైపు చూసారు. ఎంపీ కేశినేని చిన్ని ద్వారా రాయబారం నడిపినట్లు ప్రచారం జరిగింది. పలు మార్లు చిన్నితో సమావేశం కావటం.. ఆయన టీడీపీ ముఖ్య నాయకత్వం వద్ద ప్రస్తావన చేసినట్లుగా పార్టీ నేతల సమాచారం. అయినా.. టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇక.. బీజేపీ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతోంది. అయినా.. వాసిరెడ్డి పద్మకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో.. ఇప్పుడు పద్మ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టత రావాల్సి ఉంది.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications