కేసీఆర్పై మత్తయ్య ఫిర్యాదు: ఏపీ పోలీసులకు చిక్కులా?
విజయవాడ: ఓటుకు నోటు కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో జెరూసలేం మత్తయ్య ఏ 4 నిందితుడిగా ఉన్నాడు. ఇతను తమ ఆదీనంలో లేడని సీఐడీ ఎస్పీ కోటేశ్వర రావు చెబుతున్నారని వార్తలు వస్తున్నాయి.
మత్తయ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, పలువురి పైన విజయవాడ సత్యనారాయణపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.

అయితే, వేరే రాష్ట్రంలో నిందితుడైన వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఫిర్యాదు ఎలా తీసుకున్నారని కూడా అంటున్నారు. ఇది ఏపీ పోలీసులకు చిక్కులు తెస్తోందని అంటున్నారు. దీనిపై మరో వాదన కూడా ఉంది. వేరే రాష్ట్రంలో మత్తయ్య నిందితుడనే సమాచారం లేకుంటే ఎలా తెలుస్తోందనే వాదనలూ వినిపిస్తున్నాయి.
కాగా, ఓటుకు నోటు కేసులో మత్తయ్య కాల్ డేటాను సీఐడీ అధికారులు సేకరించారు. మత్తయ్యకు ఫోన్ చేసిన నేతలు, అధికారుల వివరాలను సేకరిస్తున్నారు. తనకు ప్రాణభయం ఉందని చెప్పడంతో మత్తయ్యను సీఐడీ తమ రక్షణలోనే ఉంచుకుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications