విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దుకాణం ముందు నిద్రిస్తున్న మహిళపై గ్యాంగ్ రేప్

మతిస్థిమితం లేని ఓ మహిళపై నలుగురు వ్యక్తులు అమానుష చర్యకు పాల్పడ్డారు. నిద్రిస్తున్న మహిళపై సామూహిక అత్యాచారం చేశారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: మతిస్థిమితం లేని ఓ మహిళపై నలుగురు కిరాతకుడు అఘాయిత్యానికి పాల్పడ్డారు. గూడు లేని ఆ మహిళ ఓ దుకాణం ముందు నిద్రిస్తుండగా నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. చిన్నపాటి పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్న 55 ఏళ్ల వృద్ధురాలపై వారు ఆ పనికి ఒడిగట్టారు.

ఓ దుకాణం ముంు ఆదమరిచి నిద్రిస్తున్న ఆమెపై నలుగురు కామాంధులు మద్యం మత్తులో ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. విశాఖపట్నంలోని పూర్ణామార్కెట్‌ చేపల బజార్‌లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. గత పదిహేనేళ్లుగా ఆమె అక్కడే ఉంటోంది. దుకాణదారులు పెట్టే ఆహారాన్ని తిని రాత్రిపూట అక్కడే నిద్రపోతుంటుంది. అలాగే ఆదివారం రాత్రి వరకూ చేపలబజారులోని సత్యవతి, పీర్లమ్మ దుకాణాల వద్ద పనిచేసిన బాధితురాలు రాత్రి భోజనం చేసి అక్కడే గట్టు మీద నిద్రపోయింది.

Woman gang raped by four men in Visakhapatnam

సోమవారం తెల్లవారుజాము సమయంలో ముగ్గురు, నలుగురు వ్యక్తులు బాధితురాలు నిద్రపోతున్న దుకాణం వద్దకు వచ్చారు. మద్యం మత్తులో ఉన్న వారంతా కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావమై బాధతో అరుస్తున్న ఆమె ముఖంపై బాదారు. దీంతో ఆమె ముఖం, కళ్లు, పెదాలు కమిలిపోయి బాగా వాచిపోయాయి.

ఆ దెబ్బలకు తాళలేక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆమెను వదిలేసి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉదయం ఏడు గంటల సమయంలో మార్కెట్‌కి వెళ్లినవారు రక్తపు మడుగులో పడి ఉన్న బాధితురాలిని చూసి దుకాణదారు పీర్లమ్మకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. వెంటనే ఆమె వచ్చి కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.

English summary
A 55 year old woman has been gang raped in Visakhapatnam of Andhra Pradesh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X