అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే: విపక్షాలపై దేవినేని ఉమ ఫైర్
గుంటూరు/ విజయనగరం: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతాలోని చెన్నాయపాలెం సరస్వతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ భూముల్లో రైతులపై దాడి చేసిన కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు.
పిన్నెళ్లి వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కూడా తెలియకుండా గత రాత్రి నుంచి అదృశ్యమవడంతో వారు డీఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. చెన్నాయపాలెం సంఘటన కేసులో ఏక్షణంలోనైనా అరెస్ట్ చేస్తారనే ఎమ్మెల్యే పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, తుపాను బీభత్సంతో ప్రజలు అల్లాడుతుంటే విపక్షాలు మానవత్వం మరిచి మాట్లాతున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలకు మాట్లాడే అర్హతే లేదన్న ఆయన పనిచేసే ప్రభుత్వంపై రాళ్లెయొద్దని హెచ్చరించారు.
చంద్రబాబు పనితీరు చూసి ప్రతిపక్షాలు ఈర్ష్య పడుతున్నాయని ధ్వజమెత్తారు. కేబినెట్, అధికారయంత్రాంగం మొత్తం తుపాను సహాయకచర్యల్లో పాల్గొంటోందని ఆయన వివరించారు. గిరిజన ప్రాంతాల్లోనూ సహాయక చర్యలను విస్తరింపచేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications