ప్రత్యేక హోదా: పార్లమెంట్ ఆవరణంలో ఎంపీల ధర్నా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎంపీలు పార్లమెంట్ ఆవరణంలోని గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. సోమవారం ఉదయం ఈ ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి న్యాయం చెయ్యాలని నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ లో మాట ఇచ్చారని, ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే రాష్ట్రం అభివృద్ది చెందదని, ప్రజలకు కష్టాలు వస్తాయని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఎంపీలు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చే విషయంలో సహకరించాలని అన్నారు.
గత వారం నుంచి వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ లోపల, బయట ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలు పూర్తి అయ్యే వరకు తాము ఇలాగే ఆందోళనలు చేస్తామని వైసీపీ ఎంపీలు అంటున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications