Amaravati: ఈ ఏడాది అమరావతికి మళ్లీ ప్రాణం..! అయినా ఆ ఒక్కటీ లోటే..!
ఏపీ రాజధానిగా 2016లోనే నిర్ణయించిన అమరావతి పనులు కొంత మేర ప్రారంభమైనా 2019లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రావడంతో నిలిచిపోయాయి. మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా అమరావతితో పాటు విశాఖ, కర్నూలు రూపంలో మరో రెండు రాజధానులు పోటీకి వచ్చాయి. అయితే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ 2019లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో 2024లో అమరావతిలో తిరిగి పనులు ప్రారంభించేందుకు అవకాశం లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న కూటమి సర్కార్ ఈ ఏడాది ప్రధాని మోడీని రాష్ట్రానికి రప్పించి అమరావతి పనుల పునఃప్రారంభం చేసింది.
అమరావతి రాజధాని పనుల ప్రారంభానికి సూచికగా ముందుగా జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టిన కూటమి సర్కార్.. ఆ తర్వాత క్రమంగా అసలు పనులపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా గత నెలలో రాజధాని ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) ప్రధాన భవనం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభించారు. అదే సమయంలో అమరావతిలో గతంలో సగంలో వదిలేసిన అధికారుల క్వార్టర్లు, ఎమ్మెల్యేల క్వార్టర్లు, శాశ్వత సచివాలయం, ఇతర టవర్స్ నిర్మాణాలు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి.

దీంతో పాటు అమరావతికి గతంలో వచ్చి తిరిగి వెళ్లిపోయిన పలు సంస్థల్ని తిరిగి తీసుకురావడంలో కూటమి సర్కార్ సక్సెస్ అయింది. దీంతో ఆయా సంస్థలు తిరిగి ఇక్కడికి వచ్చి నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. అలాగే కొత్తగా మరికొన్ని సంస్థలు కూడా ఇందులో వచ్చి చేరాయి. వీటిలో దసపల్లా గ్రూప్, ఎక్స్ ఎల్ ఆర్ఐ, బసవతారకం ఆస్పత్రి వంటి ఎన్నో నిర్మాణాలు ఉన్నాయి. దీంతో పాటు క్వాంటం వ్యాలీ నిర్మాణానికి కూడా ప్రభుత్వం పనులు వేగంగా పూర్తి చేస్తోంది.

మరోవైపు అమరావతి రైతులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్లను ఇచ్చేందుకు మార్గం సుగమం అయింది. దీంతో పాటు రైతులకు గతంలో ఇచ్చిన మిగతా హామీల అమలు కూడా ప్రారంభమైంది. దీంతో రైతులు సంతోషంగా కనిపిస్తున్నారు. మరోవైపు రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు,ఇతర ప్రక్రియలు కూడా వేగంగా పూర్తవుతున్నాయి. అదే సమయంలో రాజధానిలో మరో 16వేల ఎకరాలకు పైగా భూముల్ని భూసమీకరణ చేసేందుకు కేబినెట్ లైన్ క్లియర్ చేసింది. ఇందులో కొత్త ఎయిర్ పోర్టుతో పాటు మరికొన్ని కీలక నిర్మాణాలు చేపట్టేందుకు రంగం సిద్దమవుతోంది. అయితే ఇంత జరిగినా అమరావతిపై కేంద్రం రాజధానిగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల మాత్రం కాలేదు. దీని కోసం రైతులతో పాటు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
-
పుట్టా మహేష్ పై తేల్చేసిన చంద్రబాబు, పార్టీ వీళ్లను మోయాలా..!! -
జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం...!! -
కొత్త ఇళ్ల పై ప్రభుత్వం గుడ్ న్యూస్- అర్హుల జాబితా సిద్దం, పంపిణీ ఇలా..!! -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు












Click it and Unblock the Notifications