3 రోజుల్లో పెళ్ళి: వరుడు మృతి, ఏమైందంటే?
హైదరాబాద్: కడప జిల్లా లింగాల మండలంలోని దొండ్లవాగు గ్రామ సమీపంలో ఆదివారం నాడు రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో పెళ్ళి కాబోయే యువకుడు మృతి చెందాడు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
కడప జిల్లా పులివెందులకు చెందిన జి మరియమ్మ, సంరాజుల కొడుకు శేఖర్బాబు కు జమ్మలమడుగు మండలం గూడెం చెరువుకు గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది,.

మే 17వ తేదిన వివాహం పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరగాల్సి ఉంది. అయితే ఈ వివాహానికి ఆహ్వనించేందుకుగాను పెళ్ళి పత్రికలను పంచేందుకు మోటార్ సైకిల్పై శేఖర్ బాబు వెళ్ళాడు. పులివెందుల నుండి సింహాద్రిపురం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం శేఖర్బాబు వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో శేఖర్ బాబు మోటార్ బైక్ పై నుండి పడి కిందపడ్డాడు.
రోడ్డుకు బలంగా శేఖర్ బాబు తల తగిలింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా శేఖర్ బాబు మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదంలో శేఖర్ బాబు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహన్ని పులివెందుల ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications